‘గీతాగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తరువాత కూడ ఏడాది కాలంగా దర్శకుడు పరుశు రామ్ ఖాళీగా ఉండటం చూస్తుంటే హిట్స్ వచ్చినా కొందరికి వాటిని క్యాష్ చేసుకోవడం తెలియదు అని అనిపిస్తోంది. చిన్న హీరోలతో సినిమాలు చేయమని పరుశు రామ్ కు ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా మహేష్ కోసం ఎదురు చూపులు చూస్తూ పరుశు రామ్ చేసిన ప్రయత్నాలకు మహేష్ నుండి ఒక తెలివైన సమాధానం వచ్చినట్లు టాక్. 

అల్లు అరవింద్ నిర్మాణంలో మహేష్ తో సినిమా చేయడానికి పరుశు రామ్ ఒక ప్రత్యేకమైన రైటర్స్ గ్రూప్ ను పెట్టి ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న బ్యాంకింగ్ కుంభకోణాల నేపధ్యంలో ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను తయారుచేసాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ కథను మహేష్ కు వినిపించడానికి కొరటాల శివ సహాయం తీసుకుని మహేష్ ను కలిసి ఈమధ్య వినిపించినట్లు టాక్. 

ఆ కథను మహేష్ ఒపికగా విని తన నిర్ణయం చెపుతాను అంటూ ఆ సమావేశాన్ని ముగించిన తరువాత మహేష్ పరుశు రామ్ కు పంపిన మెసేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'పరుశు రామ్ మీరు చెప్పిన స్క్రిప్ట్ చాలా బాగుంది. అలాంటి స్క్రిప్ట్, అందులో నా కోసం తయారు చేసిన పాత్ర నిజంగా గొప్ప సృజనకు నిదర్శనం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆ స్క్రిప్ట్ ఓకె చేసి ఆ పాత్ర చేయలేను. అందువల్ల మీరు వేరే ప్రాజెక్టు చూసుకోవచ్చు' అంటూ మహేష్ సున్నితంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి ప్రస్థుతం మహేష్ ఆలోచనలు అన్నీ మళ్ళీ వంశీ పైడిపల్లితో సినిమా చేయాలి అని ఉన్న నేపధ్యంలో ఇలా సున్నితంగా పరుశు రామ్ ను తిరస్కరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు మహేష్ కు పరుశు రామ్ చెప్పిన కథ అంతా పేపర్ లో చదివే విషయాలుగా అనిపించడంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకుని మరొకసారి తన చిరునవ్వుతో కూడిన తెలివితేటలు ప్రయోగించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: