క్షణం సినిమా ద్వారా ఇండస్ట్రీ చూపుని తన వైపు తిప్పుకునేలా చేసిన నటుడు అడవి శేష్. ఆ సినిమాకి కథ, కథనం అందించి రచయితగా తనదైన ముద్ర వేసాడు. ఈ సినిమా తర్వాత "గూఢచారి" అంటూ మనముందుకు వచ్చాడు. గూఢచారి కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత శేష్ తీసే సినిమాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. కొత్త రకమైన కథలతో, విభిన్నమైన కథలతో మన ముందుకు వస్తున్నాడు.


తాజాగా శేష్ నటించిన "ఎవరు" చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రెజీనా నటిస్తుంది. టీజర్ కీ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేష్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.క్షణం, గూఢచారి సినిమాల తర్వాత కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. కొన్నేళ్లుగా నా కెరీర్ గొప్పగా సాగడానికి చాలా మంది సహకరించారు. ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా ఎవరో ఒకరి సపోర్ట్ లేకపోతే రాణించలేం.


ప్రతీ దశలో ఎవరో ఒకరు నాకు అండగా నిలిచారు. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆఫీస్ బాయ్‌కి అంకింతం అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాను. ఏ ఒక్కరిని మరిచిపోకూడదు. నాకు తోటి నటులు, మీడియా, స్నేహితులు సహకారం మరవలేం అని అడివి శేషు అన్నారు.గూఢచారి సినిమా రిలీజ్ సమయంలో చాలా మంది హీరోలు నాకు సహకరించారు. అల్లు అర్జున్ నా టీజర్ గుంచి ట్వీట్ చేశారు. సినిమా బాగుందని మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.


గత కొన్నేళ్లుగా నా కెరీర్‌లో ఎదురైన నా అనుభవాల ద్వారా సినిమాల ఎంపికలో మార్పు వచ్చింది. కిస్ సినిమా తర్వాత చాలా సంఘటనలు ఎదుర్కొన్నాను. ఆ సినిమాకు ముందు ఇండస్ట్రీలో కొంత మంది నా ఆలోచనలను తప్పుదారి పట్టించారు. హీరో, కమర్షియల్ అంశాల పేరుతో సినిమాపై నాకు భ్రమలు కల్పించారు. కానీ అనుభవాల నుంచి నేను పాటలు నేర్చుకొన్నాను. కిస్ సినిమా నాకో గుణపాఠం అని అన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: