అమీర్ ఖాన్.. రీమేక్ కు చాలా దూరంగా ఉండే వ్యక్తి. కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ సాధించిన అమీర్ ఖాన్ గత కొంతకాలంగా హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. వరసగా సినిమాలు ప్లాప్ అవుతుండటంతో ఈ హీరో ఆలోచనలో పడ్డాడు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఖాన్ త్రయం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది.
ఖాన్ త్రయం సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ గతంలో ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫెయిల్ అయినప్పుడల్లా అయన సౌత్ సినిమాలు తీసుకొని రీమేక్ చేసేవారు. అలా రీమేక్ చేసి తిరిగి హిట్ కొట్టేవాడు. ఆ తరువాత తిరిగి ట్రాక్ లోకి వచ్చేవాడు. షారుక్ కూడా గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. వరసగా ప్లాప్ అవుతున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు షారుక్.
ఇప్పుడు అమీర్ కూడా సల్మాన్ బాటలో నడవబోతున్నాడా అంటే అవునని అంటున్నారు. అప్పుడెప్పుడో గజినీ సినిమాను రీమేక్ చేశాడు. ఆ తరువాత రీమేక్ జోలికి వెళ్ళలేదు. సొంత కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. అమిర్ ఖాన్ చాలా కాలంగా తమిళ్ మూవీ విక్రం వేద సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు ఈ వార్తలను కొట్టేశారు.
కానీ ఫైనల్ గా ఈ మూవీని రీమేక్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. విక్రమ్ వేద సినిమాలో పోలీసుకు, క్రిమినల్ మధ్య జరిగే ఆధిపత్యం చుట్టూ సినిమా తిరుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ నటిస్తే.. క్రిమినల్ గా విజయ్ సేతుపతి నటించాడు. హిందీలో విజయ్ సేతుపతి రోల్ ను అమిర్ ఖాన్ చేస్తుండగా, మాధవన్ రోల్ ను సోహైల్ అలీ ఖాన్ చేస్తున్నారట. తమిళ్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్.. గాయత్రిల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.