దేశ పౌరులు ఎంతో గౌరవంగా జరుపుకుంటున్న పండగ..స్వాతంత్ర్య దినోత్సవ వేడుక.  దేశంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.  దేశ ప్రధాని మొదలు గల్లీల్లో చోటా మోటా నాయకులు సైతం స్వాతంత్ర వేడుకులు సంతోషంగా జరుపుకుంటారు.  విద్యావవస్థ, పారిశ్రామిక రంగం, రాజకీయ నాయకులు ఇలా విభిన్న వర్గాల వారు 73 వ స్వాతంత్ర వేడుకలు సంబురంగా జరుపుకుంటున్నారు. 

ఇక సినీ సెలబ్రెటీలు సైతం ఈ వేడుకలను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జండావందనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానులకు విషెస్ తెలియజేస్తున్నారు.  తాజాగా యంగ్ టైగర్ ఎన్టీయార్ తన తనయుడు అభయ్ రామ్ పిక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఖాకీ దుస్తులు ధరించి సెల్యూట్ చేస్తూ అభిరామ్ తండ్రికి తగ్గ తనయుడిలా కనిపిస్తున్నాడు.  అభిరామ్ కూడా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

గతంలో ఎన్టీఆర్ సైతం బాలనటుడిగా నటించిన విషయం తెలిసిందే.  అయితే ఈ ట్రెండ్ అల్లు అర్జున్ మొదలు పెట్టారు..తన కుమారుడు అల్లు అయాన్ తో ప్రతి అకేషన్ కి ఆ సాంప్రదాయం ప్రకారం తయారు చేసి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.  ఇప్పుడు ఇదే ట్రెండ్ టాలీవుడ్ లో కొనసాగుతుంది.  తమ పిల్లలతో సెలబ్రెటీలు సందర్భానుసారంగా అకేషన్స్ లో పాల్గొని ఫోటోలు పంపుతూ తెగ సంబరపడిపోతున్నారు. ఇలాంటి ఫోటోలు ఫ్యాన్స్ బాగా లైక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఎన్టీయార్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: