అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు " అల.... వైకుంఠపురములో" అనే టైటిల్ ఫిక్స్ చేసారు నిర్మాతలు. ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన అల్లు అర్జున్ డైలాగ్ చెప్పే టీజర్ విడుదలయింది. 40 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో మురళీ శర్మ అల్లు అర్జున్ ను " ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్... " అని అడగగా అల్లు అర్జున్ సమాధానంగా "ఇవ్వలే వచ్చింది" అని చెప్తాడు. 
 
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా అల.. వైకుంఠపురములో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి రెండు సినిమాలు హిట్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్లాప్ తరువాత అల్లు అర్జున్ ఒక సంవత్సరం పాటు ఏ సినిమాలో నటించలేదు. స్టార్ హీరోలు అందరూ వరుసగా సినిమాలు చేసుకుని పోతూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నాడు. 
 
కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి సమాధానంగా గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అంటూ తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు బన్నీ. అల... వైకుంఠపురములో సినిమా తరువాత కెరీర్లో గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అల.. వైకుంఠపురములో పూర్తి అయిన తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా మొదలు కాబోతుంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. 
 
అల.. వైకుంఠపురములో సినిమా 2020 సంక్రాంతి పండుగకు విడుదల కాబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది. సుశాంత్, నివేతా పేతురాజ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: