యంగ్ హీరో అడివి శేష్ , జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని హీరో హీరోయిన్లు గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ   2 స్టేట్స్  తెలుగు  రీమేక్ ప్రారంభమై ఏడాదికి పైగా అవుతుంది కానీ ఈచిత్రం గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు.    నూతన దర్శకుడు వెంకట్  ఈ చిత్రానికి దర్శకుడు  కాగా సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తైయింది.  అయితే అవుట్ ఫుట్ అడివి శేష్ కు నచ్చకపోవడంతో  శేష్ సినిమా కు రిపేర్లు చేద్దాం అనుకున్నాడు కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించక పోవడంతో  సినిమా ను మొత్తానికే క్యాన్సల్ చేశాడని అప్పట్లో టాక్ వచ్చింది. 


ఇక ఇదే విషయాన్ని  తాజాగా అడివి శేష్ దగ్గర ప్రస్తావించగా  ప్రస్తుతం మేజర్ , గూఢచారి 2 చిత్రాలను పూర్తి చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాని  ఆ తరువాతే  2స్టేట్స్ రీమేక్ గురించి ఆలోచిస్తానని  శేష్ అన్నాడు.  ఆరెండు సినిమాలు పూర్తి చేయడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది.  మరి ఈసినిమాను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు.  దాంతో ఆ రీమేక్ క్యాన్సల్ అయ్యిందని చెప్పకనే చెప్పాడు ఈహీరో. 


ఇక అడివి శేష్ నటించిన తాజా చిత్రం 'ఎవరు' ఈ రోజు విడుదలకాగా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా  తెరకెక్కిన ఈ చిత్రంలో  ట్విస్టులు  హైలైట్ అని ముఖ్యంగా క్లైమ్యాక్స్ సూపర్ గా ఉందని టాక్ వస్తుంది. ఈసినిమాలో  నవీన్ చంద్ర ముఖ్య పాత్రలో నటించాడు. కాగా  సోలో హీరోగా ఈసినిమాతో అడివి శేష్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఆయన నటించిన క్షణం   , గూఢచారి  చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 






మరింత సమాచారం తెలుసుకోండి: