టాలీవుడ్ లో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి శ్రీదేవి ఎవరూ ఊహించని విధంగా కన్నుమూశారు. బాల నటిగా సినీ రంగప్రవేశం చేసిన శ్రీదేవి ఎన్నో అవార్డులు రివార్డులు గెల్చుకుంది. బాలనటిగా కనిపించిన శ్రీదేవి ‘పదహారేళ్ల వయసు’ సినిమాతో హీరోయిన్ గా తన అందచందాలతో ఆకట్టుకుంది. దాంతో దర్శక, నిర్మాతలు ఆమెపై దృష్టిపెట్టడం, అగ్ర హీరోల సరసన ఛాన్సు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.
ఒక్క తెలుగులోనే కాకుండ బహుబాషా సినిమాల్లో నటించిన శ్రీదేవి అప్పట్లో అన్ని భాషట్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఆమె అకస్మాత్తుగా బాలీవుడ్ లోకి వెళ్లింది. అక్కడ కూడా అప్పటి అగ్ర హీరోయిన్లతో పోటీ పడి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది.
వివాహం జరిగిన తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది శ్రీదేవి. ఆమె సంతానం జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారి ఉజ్వల భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నది. జాహ్నవి కపూర్ ‘ధడక్’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తన కూతురుని స్టార్ హీరోయిన్ గా చేయాలని భావించిన ఆమె ఆ సినిమా రిలీజ్ కాకముందు కన్నుమూసింది. తాజాగా శ్రీదేవిపై బోనీకపూర్ మరోసారి తన ప్రేమ, వాత్సల్యాన్ని చాటుకున్నారు.
ఆమె భౌతికంగా మా నుంచి దూరమైనా మానసికంగా నిత్యం మాతోనే మమేకమై ఉంటుందని అన్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీకపూర్ మాట్లాడారు. శ్రీదేవి లాంటి మంచి మనిషి..మహోన్నతమైన మనిషిని నేను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చనిపోయాక కూడా ఓ లెజెండ్గానే మిగిలి పోయింది. ఆమె ఎప్పటికీ గొప్ప వ్యక్తి’ అని బోనీకపూర్ భార్య వ్యక్తిత్వాన్ని కొనియాడారు. శారీరకంగా శ్రీదేవి తమతో లేకున్నా తమని ఆశీర్వదిస్తూ బాగోగులు చూసుకుంటూ నిత్యం తమతోనే ఉంటుందని అన్నారు బోని కపూర్.