మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద’ కమర్షియల్ గా సక్సెస్ సాధించకున్నా వరుణ్ తేజ్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె ఏకంగా జాతీయ స్థాయి హిట్ సాధించింది.  ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.  ఈ సినిమా తర్వాత లోఫర్ కాస్త నిరాశ పరిచినా శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ బాక్సాఫీస్ షేక్ చేసింది.  అప్పటి నుంచి వరుణ్ తేజ్ కి అన్నీ బాగా కలిసి వస్తున్నాయి.  ఈ సంవత్సరం వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

తాజాగా వరుణ్ తేజ్,   హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో మొత్తం నెగిటీవ్ షేడ్ లో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. అందుకోసం తన లుక్ కూడా పూర్తిగా మార్చుకున్నాడు.  ఇటీవల రిలీజ్ అయిన ఈ పోస్టర్స్ చూసి అప్పుడు అంచనాలు పెరిగిపోయాయి.  నేడు 73 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘వాల్మీకీ’ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా ఈ ప్రాజెక్టు తెర‌కెక్కుతుంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ వాల్మీకి టీజర్ ను విడుదల చేసింది.  ఇక టీజర్ పరంగా చూస్తే..నా సినిమాలో విలనే నా హీరో అనే డైలాగ్స్ తో టీజర్ షురూ అవుతోంది. అందుకే పెద్దోళ్లు చెప్పిన్రు. 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలే..2 దాచుకోవాలె అంటూ వరుణ్ తేజ్ చెప్పే సంభాషణలు టీజర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి.

ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన అందాల బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది. గతంలో హరీషన్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో నటించింది.  ఈ మూవీతో ఆమెకు తెలుగులో వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఈ మూవీకి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: