సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర, మహేష్ బాబు ముగ్గురు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలిసిందే. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహేష్ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.


ఇదిలాఉంటే ఈ సినిమాలో హైలెట్ గా నిలిచే ట్రైన్ సీన్ గురించి లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ హైలెట్ గా ఉంటుంది. అప్పటి నుండి ఇప్పటివరకు అలాంటి కామెడీ సీన్ రాలేదని అంటుంటారు. అయితే కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో వెంకీ సినిమా మించే కామెడీ చేస్తున్నారట.


ఈ సినిమాలో మహేష్ తో పాటుగా బండ్ల గణేష్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ట్రైన్ సీన్ లో బండ్ల గణేష్ కామెడీ అదిరిపోద్దట. ఈ సీన్ లో హీరోయిన్ రష్మిక మిగతా ఆర్టిస్టులు సంగీత, హరితేజ కూడా నటిస్తున్నారు. గ్రూప్ మధ్యలో దర్శకుడు అనీల్ రావిపుడితో పాటు బండ్ల గణేష్ కూడా ఉన్నాడు.


మొత్తానికి ఈ ట్రైన్ ఎపిసోడ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. టైటిల్ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచగా సినిమా తప్పకుండా బాక్సాఫీస్ షేక్ చేయడం సిద్ధమని అంటున్నారు. 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా మరోసారి మహేష్ కు సంక్రాంతి సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది. ఓ పక్క ఈ సినిమాకు పోటీగా అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో అల వైకుంఠపురములో సినిమా కూడా పొంగల్ వార్ లో దిగుతుంది. ఈసారి సంక్రాంతి ఫైట్ భారీగానే ఉండేలా కనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: