స్టార్ సినిమా అంటే కోట్ల కొద్ది బడ్జెట్ సంవత్సరాలుగా షూటింగ్.. సినిమా రిలీజ్ కు ముందు కావాల్సినంత హైప్ ఇవన్ని చేస్తేనే కాని స్టార్ సినిమాకు సూపర్ బజ్ ఏర్పడుతుంది. అయితే ఇవేమి లేకుండానే సైలెంట్ గా హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు యువ హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి సినిమాలతో హిట్ అందుకున్న అడివి శేష్ గురువారం వచ్చిన ఎవరుతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.   


వెంకట్ రాంజీ డైరక్షన్ లో వచ్చిన ఎవరు సినిమా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో.. బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల మనసులు గెలిచింది. సినిమాకు బడ్జెట్ కూడా పెద్దగా పెట్టినట్టు లేరు. పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాలో అడివి శేష్ తో పాటుగా రెజినా కసాండ్రా నటించింది. నవీన్ చంద్ర కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.


ఎవరు సినిమాతో హిట్ అందుకున్న అడివి శేష్ ను చూసి స్టార్స్ సైతం షాక్ అవుతున్నారు. చిన్న బడ్జెట్ తో అదిరిపోయే కంటెంట్ తో అతని సినిమాలు వస్తున్నాయి. బడ్జెట్ ఎలాగు కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి పెద్దగా రిస్క్ కూడా అనిపించదు. ఫైనల్ గా ఎవరు సినిమాతో మరోసారి అడివి శేష్ తన సత్తా ఏంటో చూపించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కథ కన్నా కథనం ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగించింది.


సినిమాలో అడివి శేష్ నటన కూడా ఇంప్రెస్ చేసింది. ఇలానే చేస్తే అడివి శేష్ కూడా స్టార్స్ సరసన నిలిచేలా ఉన్నాడని చెప్పొచ్చు. మొదట్లో హీరోగా దర్శకుడిగా రెండు మూడు ప్రయత్నాలు చేసిన అడివి శేష్ క్షణం నుండి తన టైం స్టార్ట్ అయ్యేలా చేసుకున్నాడు. ఫైనల్ గా ఎవరు రిజల్ట్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. కొందరు హీరో హిట్ సినిమా కోసం నానా తిప్పలు పడుతుంటే అడివి శేష్ మాత్రం హిట్ టార్గెట్ తో ప్రతి సినిమా చేస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: