అక్షయ్ కుమార్ మరియు విద్యాబాలన్ తాము నటించిన 'మిషన్ మంగల్' చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది, అన్ని వర్గాల నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంటోంది.
ఇప్పుడు, విద్యా మరియు అక్షయ్ ప్రమోషన్ల కోసం ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. వీడియోలో అభిమానులు తమ అభిమాన నటితో సెల్ఫీలు క్లిక్ చేయడానికి ముందుకు వస్తుంటే, అక్షయ్ ప్రేక్షకుల నుండీ విద్యా ను కాపాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కిలాడి గ్రూప్ అని అక్షయ్ అభిమానుల సంఘం లొ ఒకరు పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత అభిమానులు అక్షయ్ పై చాల మంది ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా లో విద్యా, అక్షయ్ తో పాటు సోనాక్షి సిన్హా, కృతి కుల్హారీ, నిత్యా మీనన్ మరియు షర్మాన్ జోషి కూడా నటించారు. జగన్ శక్తితో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇస్రో యొక్క 'మార్స్ ఆర్బిటర్ మిషన్' ఆధారంగా తీయబడింది. సినిమా లో భారతీయ స్త్రీ లు తమ ఇంటిని , తమ పనిని ఎలా సద్దుబాటు చేస్కుంటారో, అంత పెద్ద దానిని అందరు కలిసి ఎలా సాధించారో చక్కగ చూపించారు.
కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసంజ్ మరియు కియారా అద్వానీ కలిసి నటిస్తున్న రాజ్ మెహతా 'గుడ్ న్యూస్' లో అక్షయ్ తరువాత నటించనున్నారు.
Akshay sir mobbed by fans in Noida. #MissionMangalPromotions#MissionMangal @akshaykumar pic.twitter.com/YCVbTeByeX
— ❤ KHILADI GROUP ❤ (@TheKHILADIGroup) August 12, 2019