మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మిరపకాయ్, గబ్బర్ సింగ్ మరియు డీజే వంటి మాస్ సినిమాలు తెరకెక్కించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళంలో బాబీ సింహ ప్రధాన పాత్రలో రూపొంది, అక్కడ సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ అలానే మెగా ఫ్యాన్స్ లోను మంచి అంచనాలు వున్నాయి. 

ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీ టీజర్, సినిమాపై అంచనాలు మరింతగా పెంచగా, స్వతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అప్పుడే ఒక మిలియన్ కు పైగా వ్యూస్ ని సాధించి దూసుకుపోతున్న ఈ టీజర్ లో వరుణ్ తేజ్ మాస్ పంచ్ లతో కూడిన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, నిజంగా మెగా ఫ్యాన్స్ కు మంచి ఐ ఫీస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక టీజర్లో అదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ తో పాటు మరీ ముఖ్యంగా చివర్లో 'మన పెద్దోళ్ళు మనకంటూ మిగిల్చిన నాలుగు బుల్లెట్లలో రెండు కాల్చుకుని, రెండు మిగుల్చుకోవాలి' అని వరుణ్ పలికిన డైలాగ్ నిజంగా అదుర్స్ అనే చెప్పాలి. ఇక మొత్తంగా ఈ టీజర్ ని బట్టి చూస్తే, రేపు రిలీజ్ తరువాత వాల్మీకి అదరగొట్టేలా ఉందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక హరీష్ శంకర్ గత సినిమా డీజే బాగానే ఆడినప్పటికీ, ఈ సినిమాతో హరీష్ మరొక్కసారి తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో మళ్ళి ఫామ్ లోకి తప్పకుండా వస్తారని, అలానే ఈ సినిమాతో వరుణ్ కు మంచి మాస్ హీరోగా పేరు రావడం ఖాయమని కూడా వాల్మీకి టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చేనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: