ప్రస్తుతం టాలీవుడ్ లోని అగ్ర సంగీత దర్శకుల్లో ముందువరుసలో నిలిచే దేవిశ్రీప్రసాద్ మరియు థమన్ ల మధ్య అతి త్వరలో సంగీతం పరంగా పెద్ద యుద్ధమే జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్ మూవీస్ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన దేవి మంచి ఫామ్ లో ఉండగా, మరోవైపు తొలిప్రేమ, అరవింద సమేత వంటి సినిమాలకు ఆకట్టుకునేలా సంగీతాన్ని అందించిన థమన్ కూడా అదరగొడుతూ దూసుకుపోతున్నారు. ఇక వీరిద్దరి మధ్య జరుగనున్న అతి పెద్ద పోటీ, వచ్చే సంక్రాంతి సమయంలో జరుగనుందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. 

అవునండి, వారు చెప్తున్నట్లు, ఇప్పటికే సంక్రాంతికి బెర్తులు ఖాయం చేసుకున్న రెండు టాలీవడ్ బడా సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలకు వీరిద్దరూ సంగీతాన్ని అందిస్తున్నారు. ముందుగా సరిలేరు నీకెవ్వరూ గురించి మాట్లాడుకుంటే, గతంలో మహేష్ తో వన్ నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాలకు సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చిన దేవి, ఇటీవల ఆయన నటించిన భరత్ అనే నేను, మహర్షి వంటి వరుస సినిమాలకు కూడా సూపర్ మ్యూజిక్ ని అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వరుసగా మూడవ సినిమాగా రాబోతున్న సరిలేరు నీకెవ్వరు మ్యూజిక్ పై దేవి మరింతగా శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. 

ఇకపోతే మరోవైపు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల వైకుంఠపురములో సినిమాకు యువ సంగీత తరంగం థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం, సరైనోడు సినిమాలకు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చిన థమన్, ముచ్చటగా మూడవసారి అల్లు అర్జున్ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండడంతో, పాటలు ఎలాగైనా అదరగొట్టాలని అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చే పనిలో ఉన్నాడట థమన్. మరి ఈ విధంగా రెండు భారీ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్న ఈ ఇద్దరు యువ సంగీత సూపర్ స్టార్స్ లో ఎవరు అందించిన మ్యూజిక్, వీక్షకులను అలరిస్తుందో, ఈ అతిపెద్ద సంగీత యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: