అనుష్క ప్రభాస్ ల సాన్నిహిత్యం పై వార్తలు రావడం సర్వసాధారణ విషయం. ఈ వార్తల పై ఇప్పటి వరకు ఎప్పుడు ప్రభాస్ ఘాటుగా స్పందించలేదు. అయితే తన తీరుకు భిన్నంగా ప్రభాస్ ఒక బాలీవుడ్ పత్రిక పై ప్రభాస్ తీవ్ర అసహనం వ్యక్తపరచడం హాట్ న్యూస్ గా మారింది. 

‘సాహో’ ను టార్గెట్ చేస్తున్న బాలీవుడ్ మీడియా మళ్ళీ ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం పై గాసిప్పుల ప్రచారం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇలాంటి వార్తలను ప్రచారంలోకి తీసుకు రావడంలో చాల పేరున్న ‘ముంబై మిర్రర్’ ఈమధ్య అనుష్క ప్రభాస్ లపై ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించింది.

వీరిద్దరు కలిసి ఉండటానికి అమెరికాలో ఒక ఇల్లు వెతుకుతున్నారని జపాన్ కు హాలిడే ట్రిప్ వెళ్ళబోతున్నారని దుబాయ్ లో జరగబోతున్న ‘సాహో’ స్పెషల్ షోకు అనుష్క రాబోతోంది అంటూ అనేక ఊహాగానాలు ఆ పత్రిక ప్రచురించింది. ప్రభాస్ కు త్వరలో పెళ్ళి జరగబోతోంది అంటూ ఈ మధ్య కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చూపెడుతూ 'ముంబై మిర్రర్'  పత్రిక ఈ హడావిడి మొదలు పెట్టింది. 

ప్రస్తుతం ఈ వార్తలు ప్రభాస్ దృష్టి వరకు వెళ్ళడంతో ప్రభాస్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది.  గత రెండేళ్ల నుంచి తాము ఇద్దరం ఒక్క రాజమౌళి కొడుకు పెళ్ళిలో తప్ప మరెక్కడా కలవలేదని చెపుతూ ఒకవేళ తామిద్దరి మధ్యనా ఏదైనా ఎఫైర్ నడుస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట కలిసేవాళ్లం కదా అంటూ ప్రభాస్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అంతేకాదు ‘సాహో’ విడుదల సమయంలో ఇలాంటి నెగిటివ్ న్యూస్ లు తన పై వస్తే తన ఇమేజ్ దెబ్బ తింటుందని అందువల్ల ఇలాంటి న్యూస్ లు రాకుండా కట్టడి చేయమని తన పిఆర్ వ్యవహారాలు చూస్తున్న టీమ్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: