ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి రాశీ ఖన్నా. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడుకి అవకాశాలు బాగానే వచ్చినా విజయాలు మాత్రం లభించలేదు. గ్లామర్ పరంగా స్కిన్ షో  చేసినప్పటికీ ఆఫర్లు రాకపోవడం గమనార్హం. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న "వెంకీమామా" చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు బికినీలో కనిపించి ప్రేక్షకులను కనువిందు చేయనుందట.


అయితే ఈ అమ్మడుకి మరో ఆఫర్ వచ్చిందట. ఆర్ ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి రవితేజతో ఓ సినిమా చేయబోతున్నానడట. ఇప్పటీకే కథా చర్చలు పూర్తయ్యాయి. అజయ్ చెప్పిన కథ తవితేజకి నచ్చడంతో సినిమాకి పచ్చ జండా ఊపేశారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.డిసెంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి మహాసముద్రం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.


కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.మొదట ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా అదితి రావు హైదరీ అనుకున్నప్పటికీ.. చివరకు రాశీఖన్నాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.ఇదే జరిగితే మాస్ మహారాజా రవితేజ, రాశీఖన్నా ముచ్చటగా మూడోసారి జత జతకట్టినట్లు అవుతుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు సినిమాల్లో జోడీ కట్టారు. ప్రస్తుతం రాశి ఖన్నా నాగచైతన్య జోడీగా వెంకీమామ సినిమాలో నటిస్తోంది.


ఇటీవలే స్లిమ్ లుక్ లోకి మారిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో మరో సినిమాలో కూడా అవకాశం పట్టేసింది. మరి ఈ సినిమా ద్వారా నైనా ఈ అమ్మడుకి విజయం లభిస్తుందో లేదో చూడాలి. వెంకీమామా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: