ఎఫ్ ౨ సినిమాతో మంచి విజయమ్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా చూడలేదు. కామెడీని తనదైన శైలిలో పండించి ప్రేక్షకులను వినోదాన్ని ఇవ్వడంలో దిట్ట అయిన అనిల్ ప్రస్తుతం మహేష్ బాబుతో "సరిలేరు నీకెవ్వరు "సినిమా చేస్తున్నారు. మొన్నటి వరకు కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.


అయితే ఈ సినిమాలో కామెడీ ప్రధానంగా ఉండబోతోందట. ముఖ్యంగా ట్రైన్ సీన్ లో మనల్ని కడుపుబ్బా నవ్వించనున్నాడట. అయితే ఈ కామెడీ సీన్లలో బండ్ల గణేష్ నటించనున్నాడని సమాచారం. బండ్ల గణేష్ చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది. ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో బండ్ల మళ్లీ నటుడిగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో బండ్ల గణేష్ పాల్గొన్నాడు.


కాగా తాజాగా ఈ సినిమాలో బండ్ల గణేష్ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో బండ్లతో పాటు అనిల్ రావిపూడి, రష్మిక, సంగీత, హరితేజ తదితరులు కూడా ఉన్నారు.ఇక ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట.


ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్లగణేష్ నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: