‘మన్మధుడు 2’ ఫ్లాప్ కావడంతో అక్కినేని కాంపౌండ్ షాక్ లో ఉన్నా ఆ షాక్ ను పట్టించుకోకుండా సమంత ఒక సైలెంట్ మిషన్ ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం సమంత నటించిన ‘మజిలీ’ ‘ఓ బేబి’ మూవీలు వరస విజయాలు సాధించడంతో ఇప్పుడు సమంత తన కెరియర్ కు సంబంధించి మరింత వేగాన్ని పెంచింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు గత కొద్దిరోజులుగా సమంత చెన్నైలో ఉంటూ ఒక సీక్రెట్ మిషన్ కొనసాగిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా బాగా కొనసాగుతున్న పరిస్థితులలో ఒక యదార్ధ క్రైమ్ సంఘటనను ఆధారంగా తీసుకుని సమంత తెలుగు తమిళ భాషలలో ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేయడమే కాకుండా దాని షూటింగ్ ప్రస్తుతం చాలవేగంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

అనేక ట్విస్ట్ లు ఉంటే ఈ కథ వెబ్ సిరీస్ గా తీయడంతో ఈ కథలోని సస్పెన్స్ వల్ల ఈ వెబ్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడే విధంగా సమంత ఒక యంగ్ డైరెక్టర్ చేత ఈ వెబ్ సిరీస్ కు స్క్రీన్ ప్లే వ్రాయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి వెబ్ సిరీస్ ను సమంత తమ కుటుంబ సొంత స్టూడియో అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో
కాకుండా చెన్నైలో ఎందుకు తీస్తోంది అంటూ కొన్ని మీడియా సంస్థలు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నాయి. 

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సమంత నుండి వెబ్ సిరీస్ కు వచ్చింది అంటే అది వెంటనే పాపులర్ అయిపోతుంది. అయితే సమంత ఈ వెబ్ సిరీస్ ను తన సొంత నిర్మాణ సంస్థ పేరిట తీస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో సమంత నాగచైతన్య సొంత సినిమాలు అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై కాకుండా సమంత సొంత బ్యానర్ పై వచ్చే ఆస్కారం చాల స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: