హాట్ యాంకర్ అనసూయ తన క్రేజ్ తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు తన హాట్ ఎక్స్ పోజింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ నిరంతరం తన హాట్ న్యూస్ లో నిలిచే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిపై ఎవరు ఎన్నివిమర్శలు చేసినా ఆమె పట్టించుకోదు. ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలు చేసుకుంటూనే సినిమాలలో రాణించాలని ఆమె ప్రయత్నాలు చేయడమే కాకుండా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ మూవీలలో నటించి రంగమ్మత్త పాత్రతో అవార్డులతో పాటు పేరు కూడ సంపాదించుకుంది.

దీనితో ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు పనికి వస్తుందేమో అన్న ఆశతో కొందరు చిన్న నిర్మాతలు ఆమె చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రయత్నాలలో భాగంగా గతవారం విడుదలైన అనసూయ ‘కథనం’ మూవీ కనీసం రెండవ వారం పోస్టర్ కూడ పడకుండా అన్ని ధియేటర్స్ లో లేచిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి వచ్చిన కలక్షన్స్ పోస్టర్ ఖర్చులకు కూడ రాదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీని తీసిన నిర్మాతకు మూడు కోట్ల నష్టం వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సచ్చింది రా గొర్రె’ మూవీ నిర్మాణం సగంలో ఆగిపోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇక అనసూయకు హీరోయిన్ ఛాన్స్ లు వచ్చే ఆస్కారం లేదు అన్న క్లారిటీ వచ్చేసింది. 

దీనితో ఆమెతో చిన్న సినిమాలు తీయాలని ప్రయత్నాలు చేస్తూ ఆమెకు ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చిన కొందరు నిర్మాతలు అనసూయతో ఇక సాహసం చేయలేక ఆమెకు ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయమని ఆమెతో రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో అనసూయ ఇక బుల్లితెరకు మాత్రమే పరిమితమా అంటూ కొందరు జోక్స్ వేసుకుంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: