ఒకపక్క బుల్లితెరపై రాణిస్తూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది అనసూయ. రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మ పాత్రలో అదరగొట్టిన అనసూయ తాజాగా ‘కథనం’ సినిమాలో తనకు తగ్గ పాత్ర చేసి సినిమా చేసింది. తాజాగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మిక్సడ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇటువంటి నేపథ్యంలో సినిమాని పైకి తీసుకురావడానికి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన సినిమా యూనిట్ పట్ల అనసూయ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వార్తలు వినబడుతున్నాయి.


మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్ర కోసం 35లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు కూడా సమాచారం. అయినా కానీ సినిమా యూనిట్ అనసూయ అడిగానా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎక్కడా వెనుకాడకుండా ఇచ్చారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో రూ.35 లక్షల రెమ్యునరేషన్ అంటే మంచి క్రేజ్ పేరున్న హీరోయిన్లు తీసుకుంటారు. అయినా కానీ సినిమా యూనిట్ అనసూయ డిమాండ్ మేరకు ఇచ్చిన ప్రమోషన్ కార్యక్రమంలో..చేస్తున్న సమయంలో డైరెక్టర్ ఫోన్లు లిఫ్ట్ చేయకుండా ఓ ఆట ఆడుకుందట ఈ బ్యూటీ. దీంతో 'కథనం' సినిమా డైరెక్టర్ అనవసరంగా అనసూయని సినిమాలోకి తీసుకున్నట్లు బాధపడుతున్నట్లు సమాచారం.


గత వీకెండ్ రిలీజ్ అయిన ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగా రాబట్టలేకపోవడంతో ఎలాగైనా ప్రమోషన్ కార్యక్రమాలు  చేపట్టి కొంత లాభాలు తీసుకురావాలని చూస్తున్నా సినిమా డైరెక్టర్ కి...అనసూయ ప్రమోషన్ కార్యక్రమాలకు ఫోన్ చేస్తే ఎత్తకుండా నానా ఇబ్బందులు పెడుతున్న క్రమం లో అనసూయ వ్యవహారం పట్ల లబోదిబోమంటున్నడట 'కథనం' డైరెక్టర్. అంతేకాకుండా ఈ సినిమాలో అనసూయ కార్టూన్స్ కోసం దాదాపు 20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయినా కానీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అనసూయ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: