ప్రభాస్ నటించిన సాహో సినిమా ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15వ తేదీన విడుదల కావాలి. కానీ సాహో సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 30 వ తేదీకి మార్చుకోవటంతో ఎవరు, రణరంగం సినిమాలు ఆగస్ట్ 15వ తేదీకి రిలీజ్ డేట్ మార్చుకున్నాయి. రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లు కావటంతో ప్రేక్షకులు రెండు సినిమాలపై ఆసక్తి చూపించారు. పడి పడి లేచే మనసు లాంటి ఫ్లాప్ సినిమా తరువాత శర్వానంద్, గూఢచారి లాంటి హిట్ సినిమా తరువాత అడివి శేష్ నటించిన సినిమాలు నిన్న విడుదలయ్యాయి. 
 
శర్వానంద్ రణరంగం సినిమాకు ఫస్టాఫ్ చాలా బాగుందని టాక్ రాగా సెకండాఫ్ మాత్రం యావరేజ్ గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రణరంగం మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా 4.23 కోట్ల కలెక్షన్లు అందుకుంది. సినిమాకు హిట్ టాక్ రావటంతో వారం రోజుల్లో రణ రంగం సినిమా బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్లలో రణ రంగం సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నట్లు సమాచారం. 
 
క్షణం, గూఢచారి సినిమాలతో హిట్ కొట్టిన అడివి శేష్ తన సినిమాలంటే ప్రత్యేకంగా ఉంటాయని ఇంతకుముందే నిరూపించుకున్నాడు. రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో మార్పులు చేయటంతో ఎవరు సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎవరు సినిమా తొలి రోజు కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా 2.60 కోట్లుగా నమోదయ్యాయి. 
 
నిన్న విడుదలైన రెండు సినిమాలకు హిట్ టాక్ రావటంతో రెండు సినిమాలకు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. గత వారం విడుదలైన సినిమాలేవీ అంచనాలు అందుకోకపోవటం, సాహో సినిమా విడుదలయ్యేవరకు అంచనాలున్న చిత్రం మరేదీ లేకపోవటం ఈ రెండు సినిమాలకు ప్లస్ కానుంది. హిట్ టాక్ వచ్చిన ఈ రెండు సినిమాలు ఫుల్ రన్లో ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: