ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం  తెలుగులో  విరాటపర్వం అనే పీరియాడికల్ సినిమాలో నటిస్తుంది. వేణు ఊడుగుల  తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం కాగా కొద్దీ రోజులనుండి సాయి పల్లవి షూటింగ్ లో పాల్గొంటుంది. రానా  హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. .కాగా ఈ సినిమాలో సాయి పల్లవి డీ గ్లామర్ రోల్ లో  వరంగల్  అమ్మాయిగా  కనిపించనుంది. ఆమె పాత్ర సినిమాలో  హైలైట్ అవుతుందట.  


ఇక ఈసినిమాతో పాటు సాయి పల్లవి ఇటీవల యువ సామ్రాట్  నాగ చైతన్య తో నటించడానికి ఓకే చెప్పింది. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. ఈసినిమా షూటింగ్ ఈనెల 25నుండి జరుగనుంది. దాంతో విరాట పర్వంతో పాటు ఈసినిమాను కూడా ఒకే  సారి పూర్తి చేయనుంది సాయి పల్లవి. ఇక శేఖర్ కమ్ములతో సాయి పల్లవి కి ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా బ్లాక్ బాస్టర్  హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈసినిమాలో నటించిన సాయి పల్లవి కి మంచి పేరు వచ్చింది. దాంతో శేఖర్ కమ్ముల అడుగ్గానే మరో సినిమాకు ఒప్పేసుకుంది. 


ఇక ఫిదా తరువాత శేఖర్ కమ్ముల మరో సారి లవ్ స్టోరీ నే నమ్ముకున్నాడు.  మరి ఈసారి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.  కాగా నాగ చైతన్య , సాయి పల్లవి మొదటి సారి కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది  సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: