ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా యావత్ భారతదేశంలోని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమా సాహో. ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమా అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ కు దగ్గరకొచ్చేకొద్దీ సాహో మానియా పీక్స్ కు చేరుకుంటోంది. సినిమా విడుదలకు ఇంకా 15 రోజులే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది. త్వరలో రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

 

 

మూవీపై ఉన్న క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ 'సాహో' గేమ్ రూపంలో వచ్చింది. సాహో గేమ్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ న్యూస్ ను యూనిట్ గత వారమే రివీల్ చేసింది. ఈరోజు ఫుల్ గేమ్ ని యాపిల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం యాపిల్ స్టోర్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ గేమ్ ఐఫోన్ వాడుతున్న వారు మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం  కల్పించింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్ యుజర్స్ కు కూడా ఈ గేమ్ అందుబాటులోకి తెస్తామని గేమ్ డిజైనర్ పిక్సే లాట్ లాబ్స్ అనే సంస్థ ప్రకటించింది. మొబైల్  వినియోగదారుల్లో అధికంగా ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువగా ఉంటారు కాబట్టి గేమ్ ను ఆండ్రాయిడ్ లో త్వరగా విడుదల చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. 

 

 

 

సాహోలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఆధారంగానే ఈ గేమ్ ని రూపొందించారు. గేమ్ లో చివరి లెవెల్ కి చేరుకుంటే సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్స్ తెలిసే అవకాశం ఉంది. దీంతో ఫ్యాన్స్ కి ఈ విషయం గూస్ బంప్స్ ని ఇస్తోంది. ప్రస్తుతం చెన్నై ప్రమోషన్స్ లో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత హైదరాబాద్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: