ఈ మద్య సినిమాలు రిలీజ్ కాక ముందే దానికి సంబంధించిన కొన్ని ముఖ్య సన్నీవేశాలు, డైలాగ్స్, లొకేషన్లు, పిక్చర్స్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో దర్శక, నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.  అయితే ఓ సినిమాకు హీరో ఇలా ఉంటాడు అన్న విషయం రిలీజ్ అయ్యే వరకు తెలియకపోతే ప్రేక్షకులు ఎంతో థ్రిల్ గా భావిస్తారు.  కానీ ఈ మద్య ఈ లీకేజ్ గొలతో తమ హీరో ఇలా ఉండబోతున్నారా అని రక రకాల ఊహాగానాలతో నిరుత్సాహంలో మునిగిపోతున్నారా ఆ హీరో ఫ్యాన్స్. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. 

అయితే ఈ సినిమా కమర్షియల్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది.  సినీ కెరీర్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి చిరకాల వాంఛ..ఒకటి మిగిలిపోయిందట. అదే మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింమారెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని..అందులో నటించాలని, అయితే ఆ కోరిక తన తనయుడి ద్వారా తీర్చుకోబోతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మెగాస్టార్.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది.  అన్నీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 2 రిలీజ్ చేయబోతున్నారట. ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీలో పవన్ కళ్యాన్ తనవాయిస్ ఓవర్ ఇస్తున్నారట. పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఓ డైలాగ్ లీక్ అయింది. 'అందరు గుర్తించిన వీరులు ఎందరో ఉన్నారు.. కానీ ఎవరూ గుర్తించని వీరుడొక్కడు ఉన్నారు.. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అయితే ఇది ఎంత వరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: