బిగ్ బాస్ త్రీ విజయవంతంగా ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఇరవై ఐదు రోజులలో మొత్తం ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో హేమ, రెండో వారంలో జాఫర్, మూడో వారంలో తమన్నా ఎలిమినేట్ అయిన విషయం మనకి తెలిసిందే. ఇరవై ఐదువ రోజు ఉదయం వినరా వినరా దేశం మనదే రాణి దేశభక్తి పాటతో అంతా నిద్రలేచారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే తోపాటు జాఫర్ కి హ్యాపీ బర్త్ డే అని శ్రీముఖి, బాబా మాస్టర్ చెప్పారు. బాబా మాస్టర్, రోహిణిని దేవుడా ఈ అమ్మాయి బాగా తింటోంది తక్కువ తినేలా చూడు అంటూ ఆటపట్టించాడు. తరువాత  కిచెన్ లో వరుణ్, వీతికతో నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు డిపార్ట్ మెంట్ మారిపొమ్మని చెప్పాడు.


తరువాత రోహిణిని బాబా మాస్టర్ యువార్థా కార్పొరేషన్ అనగా దానికి అవును నేను పాయిఖానా ప్రెసిడెంట్ నని మా టీమ్ బాబా, ఆసు, మహేష్ అని చెప్పి నేను ఎప్పటి నుంచో బాత్ రూమ్స్ అడుగుతున్న, వాళ్లు ఇవ్వలేదని అనగా బాబా మాస్టర్ ఎందుకంత ప్రాణం టాయిలెట్స్ అంటే నీకు అని రోహిణిని అడిగాడు. దానికి రోహిణి మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదని చెప్పింది. బాబా మాస్టర్ బాత్ రూమ్ క్లీన్ చేస్తుండగా శ్రీముఖి, హిమజ వచ్చి అసలు ఆ క్లీన్ చేయడం ఏంటి ఈ ఏరియాని ఇంత దారుణంగా చూస్తామని కలలో కూడా అనుకోలేదంటు వారిపై మండిపడి కెప్టెన్ అలీని తీసుకొచ్చి చూపిస్తూ ఈగలు ఏంటని అడగగా దానికి బాబా మాస్టర్ ఇక్కడ రెండు ఈగలు ఉండేవి వీళ్లు రాగానే అవి చచ్చిపోయాయని చెప్పగా, క్లీనింగ్ అయిపోయిన తరువాత ఏమైనా మిస్టేక్స్ వుంటే వచ్చి చెబుదామని అలీ అన్నాడు.


శ్రీముఖి, హిమజ క్లీన్ చేసినా లివింగ్ రూమ్ లో కింద పడిన దారాలను చూపిస్తూ ఇవేంటని అలీ అడిగాడు. శ్రీముఖి, హిమజ అక్కడి నుంచి జారుకోగా అలీ వాళ్ళదగ్గరికి వెళ్ళి అడిగితే డెకరేషన్ కోసం అక్కడక్కడా అలా వదిలేశామని అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తావా ఇంకోసారి కెప్టెన్ ఎలా అవుతారో చూస్తామని శ్రీముఖి అలీని హెచ్చరించింది. హిమజా, శ్రీముఖి మాట్లాడుకుంటూ పునర్నవి నామినేషన్ లో వుంటే అసలు మాట్లాడదు, మాట్లాడేందుకు ఇంట్రస్ట్ చూపించదని, రాహుల్ ఇంట్లోంచి వెళ్లిపోతే ఎంతో సంతోషిస్తానని కాని పులిహోర రాజా అనే ట్యాగ్ ఉంది కాబట్టి అతను ఇంట్లోవుండే అవకాశం వుందని శ్రీముఖి చెప్తూ, నాగార్జున గారు వారం వారం వచ్చి మనల్ని సెట్రైట్ చేయకపోతే గొడవలతో ఏ లెవల్ కి వెళ్లేవాళ్లమో అని శ్రీముఖి అంది


అంతా హాల్లో కూర్చుని ఉండగా క్లీనింగ్ ఎలా చేశారో చూడండి అంటూ బాబా మాస్టర్ చేత్తో దుమ్మును తీసుకొని అందరికీ చూపించాడు. ఇంటి సభ్యుల కోసం లగ్జరీ బడ్జెట్ టాస్క్ చెయ్యటానికి బిగ్ బాస్, కెప్టెన్ అలీని పిలిచీ ప్లాస్మా లోంచి ఒక్కో ఇంటి సభ్యుడికి ఒక్కో వస్తువు చొప్పున పదమూడు వస్తువులను సెలక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పగా అలీ బోర్డ్ మీద ఎవరికేం కావాలో రాశాడు. తర్వాత బిగ్ బాస్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంట్లోని వారంతా రెండు టీములుగా విడిపోయి రెండు అంశాలపై స్కిట్స్ ని రూపొందించి సమాజ శ్రేయస్సు కోసం ప్రదర్శించాలని, మీరిచ్చే సందేశం మిమ్మల్ని ప్రేమించేవారికి యువతకు చేరేలా చూసుకోవటం మీ బాధ్యత అని బిగ్ బాస్ అన్నాడు.అయితే స్త్రీ, పురుష సమానత్వంపై స్కిట్ లో భాగంగా నేను పెప్పర్ చికెన్ అడిగితే చికెన్ ని పేపర్ లో చుట్టుకొని వస్తావా అంటూ ఆషుని మహేష్ అడిగాడు. తరవాత రవి, వితిక లవర్స్ గా నటించారు.


ముందుగా రవి లవర్ ని పక్కనే ఉంచుకొని వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడాడు. తరువాత వితికా ఫోన్ మాట్లాడుతుండగా ఎవరితో మాట్లాడుతున్నావంటూ రవి గొడవపెట్టుకోగా, నాయిష్టం నువ్వు మాట్లాడినపుడు నేనడిగానా అని వితికా గట్టిగా సమాధానం చెప్పింది. పునర్నవి వచ్చి మా అమ్మాయిలకు ఏం తక్కువ, ఎందులోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వరంటూ వాదింస్తుండగా, ఇంతలో మహేష్ వచ్చి ఫీచర్స్ లాభాలు చూసుకొని మొబైల్స్ ను కోరినట్లు మగవాళ్లను కొంటున్నారంటూ వాదించగా,చిన్నతనం నుంచి ఆడవాళ్లంటే ఎప్పుడూ చిన్నచూపు చూస్తారని కానీ ఇప్పుడు మగవారితో సమానంగా మేము సంపాదించగలుగుతున్నామని వితికా చెప్తుండగా ఇంతలో హిజ్రా గెటప్ లో రాహుల్ వచ్చి మనుషులంతా సమానంగా బతకాలని చెప్పారు.ఇంతలో రోహిణి పోలీస్ క్యారెక్టర్ లో వచ్చి అర్ధరాత్రి ఏం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చెప్పగా ఇంతలో మహేష్ ,రవి ఆడవాళ్లంతా వెళ్లిపొండని అనగా రోహిణి వాళ్ళని కొట్టి, అయితే ఏంట్రా నేనూ ఆడపిల్లనే అర్ధరాత్రి డ్యూటీ చేయడం లేదా ఆడ మగ అందరూ సమానమే అని చెప్పింది.


తర్వాత స్కిట్ లో హిమజ భరతమాతలా నటించగా వరుణ్ ,అలీ బ్రిటిష్ వాళ్లలా వచ్చి ఇక్కడ్నుంచి వెళ్లిపోండి అని చెప్పగా ఇది మా దేశం ఎక్కడికీ వెళ్లేది అంటూ జ్యోతి ,రోహిణి, బాబా మాస్టర్ వారిమీద తిరగబడ్డారు. ఇంతలో శ్రీముఖి వచ్చి 1947 లో స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజమైన స్వాతంత్య్రం వచ్చిందో లేదో ఇక్కడున్న భరతమాతకే  తెలుసని 2019లో ఎలా వుందో చూద్దాం అని చెప్పగా, జ్యోతి,రోహిణి ఊడుస్తుండగా అలీ సిగిరెట్ కిందపడేసాడు. ఎందుకు వేశావని జ్యోతి అడిగితే ఏంటి నీ ప్రాబ్లమ్ అని గొడవ పెట్టుకోగా, మేమంతా స్టూడెంట్స్ మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలా అని జ్యోతి అనగా పనీ పాటా లేకుండా ఈ పని చేస్తున్నారా ఇదిగో అంటూ డబ్బులిచ్చి అలీ వెళ్ళిపోయాడు.



తరువాత స్కిట్ లో బాబా మాస్టర్ పేపరు చదువుతుండగా అలీ, శ్రీముఖి వచ్చారు. నాన్న గారు మేమిద్దరం అమెరికా వెళ్లాలనుకుంటున్నాం అని అలీ అన్నాడు. అంత కష్టపడి మీకోసం ఇంతా చేస్తే అమెరికా అంటారా అని బాబా మాస్టర్ సీరియస్ అయ్యాడు. తరువాత వరుణ్ అలీతో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి నడిరోడ్డు మీద ఒంటరిగా నడవాలనుకున్నా నడవనివ్వటం లేదు. నువ్వు ఇండియాలో పుట్టి పెరిగి ఇప్పుడు విదేశాలకూ వెళ్తానంటున్నావ్ మీలాంటి వాళ్లు ఉన్నంత కాలం ఇంకెక్కడ వస్తుంది స్వాతంత్రం అని అన్నాడు. ఇంతలో శ్రీముఖి వచ్చి దేశాభివృద్ధి కేవలం యువత చేతిలోనే ఉందని అందరూ కలిస్తేనే దేశం ముందుకెళ్తుందని చెప్పి ఇంటి సభ్యులంతా కలిసి మేమే ఇండియన్స్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఇరవై ఐదువ రోజు ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: