వంశీ పైడి పల్లి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ అయ్యింది.  ఈ ఏడాది టాప్ మూవీస్ లో ఇదే నిలిచింది.  మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకుంటూ రిలీజ్ అయిన ‘మహర్షి’ సామాన్య రైతు సమస్యలపై వారి గౌరవాన్ని ప్రతిభింబిచేలా చూపించారు దర్శకులు పైడి పల్లి.  ఈ సినిమాతో మహేష్ బాబు మరోస్థాయికి ఎదిగిపోయారు.  మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, పీవీపి, అశ్విని దత్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మించారు.

శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల తర్వతా ‘మహర్షి’ బిగ్గెస్ట్ హిట్ సినిమా కావడంతో ఆయన తదుపరి సినిమాలపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.  అయితే మహర్షి లెన్త్ ఎక్కువ అయిందని కొన్ని సీన్లు డిలీట్ చేశారని అప్పట్లో టాక్ వినిపించింది. తాజాగా మహర్షి చిత్రం తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. మహర్షి సినిమాలోని డీలిటెడ్ సన్నివేశాన్ని విడుదల చేశారు.  మహేష్, పూజా హెగ్డె నడుచుకుంటూ వస్తున్న సమయంలో కమల్ కామరాజు కాలు అడ్డు పెడతాడు.  ఆ తర్వాత పూజాని వెళ్లిపొమ్మని చెబుతాడు.  మహేష్ బాబు, కమల్ కామరాజు వద్దకు రాగానే నువ్వేమైనా హీరోవా అని అడుగుతాడు కమల్. అప్పుడు మహేష్ బాబు 'హీరో అనుకోవడం ఏంటి.. హీరోనే కదా' అని అంటాడు. 

మహెష్, కమల్ కామరాజును  నీ ప్రాబ్లాం ఏంట్రా..అమ్మాయితో తిరుగుతున్నాననా..ప్రాబ్లామ్స్ సాల్వ్ చేశాననా..అంటాడు.  ఆ తర్వాత నీకో పిట్ట కథ చెప్పానా అనగానే కమల్ కామరాజు ఆసక్తిగా ఏంటది అని అడుగుతాడు. తర్వాత ఎద్దులా ఎద్దులా పెరిగావ్..సిగ్గులేదురా నీకు ఇంకా ఈ పిట్టకథలు, కాకి కథలు ఏంట్రా అని కామెడీ డైలాగ్ కొడతాడు.  ఆ తర్వాత చేజింగ్..చిన్న ఫైట్ డీన్  ఇద్దరికీ క్లాస్ పీకడం ఈ సీన్లు చాలా ఆసక్తికరంగా చూపించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: