మంచి ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి తో తమ హీరో సినిమా అనగానే ఎగిరి గంతేసిన మహేష్ అభిమానులు కాస్తా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కొత్త డైరెక్టర్ అయినా కూడా వరుణ్ తేజ్, వెంకటేష్ తో 50 కోట్లు దాటించిన అనిల్ రావిపూడి బాబుతో ఇండస్ట్రీ హిట్ కొడతాడని అందరూ అంచనా వేశారు. అయితే అనిల్ రావిపూడి సినిమా పైన ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం చూసి కోపంతో ఊగిపోతున్నారు సూపర్ స్టార్ అభిమానులు. 

వివరాల్లోకి వెళితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇప్పుడు అందరికీ తెరిచిన పుస్తకం. నటీనటులు, హీరో క్యారెక్టర్, యాక్షన్ సీక్వెన్స్ లు, ప్రత్యేక పాత్రలు అన్నీ బయట పెట్టేసాడు అనిల్ రావిపూడి. అసలు సినిమాకు సంబంధించి సస్పెన్స్ ఎంత మెయింటెయిన్ చేస్తే తర్వాత ప్రేక్షకులకి అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ మొదటి నుండే మహేష్ సినిమా లీక్ లతో కాకుండా అఫిషియల్ అప్డేట్స్ తో బయటపడుతూ ఉంది. సినిమా మొదలవగానే టైటిల్ బయటికి రావడం, మహేష్ క్యారెక్టర్ పేరు, టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, టీజర్ ఇలా మొదటి షెడ్యూల్ లోనే ఇన్ని బయటికి వచ్చేశాయి. 

ఇవి చాలవన్నట్టు కశ్మీర్లో ట్రైన్ సీక్వెన్స్ గురించి వారంగా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. తాజాగా ఒక ఫోటోలో ఆ యాక్షన్ సీన్ లో ఎవరెవరు ఉంటారని అనిల్ అందరికీ బహిర్గతం చేశాడు. ఇది చూసి సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ అందరూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇకపోతే బండ్ల గణేష్ పాత్ర ముందు ఒక రూమర్ గానే ఉండిపోయింది. అయితే ఆయన మేకప్ వేసుకున్న చిత్రాన్ని అనిల్ బయట పెట్టేసాడు. పైగా అతని మెడలో ఉన్న బ్లేడ్ ని చూసి అతని క్యారెక్టర్ ని అంచనా వేయడం స్టార్ట్ చేసేసారు మన మేధావులంతా. 

ఇప్పటికే అనేక మీడియా వర్గాలకు ట్రైన్ సీన్ కి సంబంధించి లీక్ లు ఇచ్చేసిన అనిల్ తర్వాత ఏం చేస్తాడో అని ఫ్యాన్స్ భయపడి చస్తున్నారు. కెరీర్ లో మొదటి సారి ఒక పెద్ద హీరో తో భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న దర్శకుడికి మరీ ఇంత ఆత్రం ఏంటి అని వారి ఆందోళన. అన్నీ విప్పేస్తే తర్వాత సినిమాను ఎవరు ఆసక్తిగా చూస్తారని ట్విట్టర్ లో మహేష్ బాబు అభిమానులే వాపోతున్నారు. పూరి చెప్పినట్లు దర్శకులు మహేష్ బాబు అభిమానులను విపరీతంగా ఇష్టపడతారు. అలాంటి వారిని అనిల్ ఎంత కష్ట పెట్టడం కరెక్ట్ అంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: