బిగ్ బాస్ హౌస్ లో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో రాఖీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా హౌస్ లో ఉన్న సభ్యులు రాఖీ పండుగ ఉద్దేశించి చేసిన హంగామా ఎపిసోడ్ కె హైలెట్ గా నిలిచాయి. ఈ క్రమంలో హౌస్ లో వున్న ఇంటి సభ్యులు అన్నా చెల్లెలు గా ఫీల్ అయినా వాళ్లు రాఖీ కట్టుకొని భావోద్వేగ వాతావరణాన్ని ఇంటిలో సృష్టించారు. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ కి హిమజ.  రవికి రోహిణి రాఖీ కట్టగా.. మహేష్‌కి అషు.. అలీకి శివజ్యోతి రాఖీ కట్టి ఎమోషనల్ అయ్యారు.


ఇటువంటి తరుణంలో పునర్నవి ఎవరికి రాఖీ కడుతుంది అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇటువంటి తరుణంలో పునర్నవి నిలబడి రాఖీ కట్టకముందు మాట్లాడుతూ...అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అంటూ పునర్నవి రాహుల్ వైపు చూడటంతో.. రాహుల్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. కానీ ఇంతలో వరుణ్ సందేశ్ ని ఉద్దేశిస్తూ ఆ మాట అన్నట్లు పునర్నవి చెప్పడంతో రాహుల్ కూల్ అయ్యాడు.


దీంతో హౌస్ లో వారంతా నవ్వేశారు. పునర్నవి.. వరుణ్ కి రాఖీ కట్టి తమ్ముడు అని పిలిచింది. హౌస్ లో ఉన్నవారందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఒక్క రాహుల్ కి తప్ప అంటూ అతడిని టీజ్ చేసింది పునర్నవి. ఈ క్రమంలో హౌస్లో ఉన్న ఇంటి సభ్యులు గోల చేశారు. తరువాత ఆ భాస్కర్ కోసం బిగ్ బాస్ స్పెషల్ మెసేజ్ అంటూ ఓ వీడియో ప్లే చేసారు. ఆ వీడియోలో  బాబా భార్య మాట్లాడుతూ కనిపించింది. తన భర్తకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు గేమ్ ని గేమ్ లా ఆడాలని సలహా ఇచ్చింది. అయితే రేపటి ఎపిసోడ్ లో ఎవరూ హౌస్ లో నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా సస్పెన్స్ గా ఈ వారం నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: