బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు రోజు రోజుకి క్రేజీగా మారుతుంది. మూడవ వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్ గా ఆలి రెజాను ఎంపిక చేసింది. ఆలి, రాహుల్, రవి కృష్ణలకు పెట్టిన కెప్టెన్సీ టాస్క్ లో అలి రెజాకు ఇంటి సభ్యులు సపోర్ట్ చేయడంతో అలి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇక కెప్టెన్ గా ఇంటి సమస్యలను.. హౌజ్ మెట్స్ మంచి చెడులను చూస్తున్నాడు ఆలి రెజా.


స్వాతంత్ర దినోత్సవం నాడు రెండు మూడు స్కిట్స్ వేసి అలరించిన బిగ్ బాస్ కంటెస్టంట్స్.. శుక్రవారం ఎపిసోడ్ లో రాఖీ పండుగ జరుపుకున్నారు. ఇంటి సభ్యులందరు వారి ఇంటి నుండి రాఖీలు పంపించగా అవి బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించాడు. శ్రీముఖి తన తమ్ముడు పంపించిన రాఖీని ఎవరితో కట్టించుకోవడానికి ఇష్టపడలేదు.


అందుకే తమ్ముడు గుర్తుగా శ్రీముఖి రివర్స్ లో తన చేతికి బాబా భాస్కర్ తో రాఖీ కట్టించుకుంది. ఇక వరుణ్ తేజ్ కు పునర్నవి రాఖీ కట్టింది. వరుణ్ కు వచ్చిన రాఖీని హిమజ చేత కట్టించుకున్నాడు. మహేష్ విట్ట, బాబా భాస్కర్ కు అషు, రోహిణి, శివ జ్యోతి కలిసి రాఖీ కట్టారు. అలి రెజాకు వచ్చిన 3 రాఖీలను శివ జ్యోతి చేత కట్టించుకున్నాడు.           


ఈ ఎపిసోడ్ లో పునర్నవి వరుణ్ తేజ్ లో తన తమ్ముడిని చూసుకున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంటి సభ్యులు అందరికి హ్యాపీ రాఖీ.. ఎక్సెప్ట్ రాహుల్ అంటూ తనకు రాహుల్ కు మధ్య ఏదో జరుగుతుంది అన్న హింట్ ఇచ్చింది. ఈమధ్య రాహుల్, పునర్నవిలు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ బ్రేక్ ఫాస్ట్ టైంలో రాహుల్ కు పునర్నవి చపాతి తినిపిస్తుంటే వితిక వచ్చి నీకు సిగ్గులేదా అమ్మాయి తినిపిస్తుంటే చపాతి తింటావ్ అంటూ కామెడీగా వార్నింగ్ ఇచ్చింది. ఏమో బిగ్ బాస్ హౌజ్ లో ఏమైనా జరగొచ్చు.. రాహుల్, పునర్నవిల మధ్య ఏం జరుగుతుంది.. ఏం జరుగబోతుంది అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: