మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఉంటుందని అంటున్నారు.


అదేదో గాలి వార్త అని కొట్టిపారేసే లోపే.. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పిన పిక్స్ సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఫైనల్ గా సైరా కోసం పవన్ కళ్యాణ్ తన గొంతు అరువిచ్చాడు. అన్నయ్య అడగాలే కాని తమ్ముడిగా పవన్ అది చేయడా అనుకోవచ్చు. తమ్ముడు చేస్తాడని తెలిసినా అన్నయ్య మాత్రం అడగడు. ఇదిలాఉంటే సైరా టీజర్ కోసమే పవన్ డబ్బింగ్ చెప్పాడని కొందరు.. సినిమాలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని కొందరు అంటున్నారు.


ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ సైరా నరసింహా రెడ్డి సినిమా మొత్తం చూశారని తెలుస్తుంది. మూవీ రష్ చూసిన పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడని తెలుస్తుంది. ఈ వయసులో కూడా అన్నయ్య పడిన కష్టాన్ని చూసి అవక్కవడమే పవన్ వంతు అయ్యిందట. తప్పకుండా సైరా మరో సెన్సేషనల్ మూవీ అవుతుందని పవన్ చెప్పినట్టు తెలుస్తుంది.   


ఇప్పటికే సైరా సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. మేకింగ్ వీడియోతో ఆ అంచనాలు రెట్టింపు అవ్వగా ఆగష్టు 20న రాబోతున్న టీజర్ కోసం ఫ్యాన్స్ మరింత ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పదేళ్ల తర్వాత వచ్చినా ఖైది నంబర్ 150తో బాక్సాఫీస్ షేక్ చేసిన మెగాస్టార్ సైరాగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. అక్టోబర్ 2 మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే రోజు అవుతుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: