వైసిపి పార్టీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క బుల్లితెరపై రాణిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ నాయకులను మహామహులను చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం లో టెన్షన్ పుట్టించే విధంగా అప్పట్లో రోజా సృష్టించిన వాతావరణం అందరికీ ఇప్పటికీ గుర్తుంది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజా ...తాను జడ్జిగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ షో కి దూరం అయింది.


దీంతో ఆ సమయంలో రోజా ఇంకా జబర్దస్త్ షో కి వీడ్కోలు పలికింది అన్న వార్తలు అప్పట్లో వినబడ్డాయి. అంతేకాకుండా జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీ అధికారంలోకి రావడంతో ఇక పర్మినెంట్ గా రోజా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ రోజా కంటిన్యూ అయ్యారు.  ఇటువంటి తరుణంలో తాజాగా రోజా జబర్దస్త్ నుండి రోజా పర్మినెంట్ గా అవుట్ అనగా బయటికి వెళ్లిపోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అధికార పార్టీలో ప్రజాసంక్షేమం కోసం రోజా అటు రాజకీయాలను ఇటు బుల్లితెరను బ్యాలెన్స్ చేయలేకపోతున్నట్లు దీంతో తన వల్ల షోకి కష్టం రాకుండా ముందుగానే షో నుండి తానే బయటకు వెళ్లిపోవడానికి డిసైడ్ అయినట్లు సమాచారం.


వచ్చిన వార్తల్లో వాస్తవం ఉన్నట్టుగానే తాజాగా షో కి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల బట్టి అర్థమవుతోంది. ఈ ప్రోమోలో జడ్జిగా రోజా కనిపించడం లేదు. ఆమె స్థానంలోకి శేఖర్ మాస్టర్ వచ్చారు. నాగబాబు కొనసాగుతున్నారు. దీనితో రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసినట్లే అనే ప్రచారం జరుగుతోంది. సో ప్రజాసంక్షేమం కోసం రోజా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసినట్లే అని చాలామంది అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: