రెజీనా కెసాండ్రా, అడవి శేష్ ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం "ఎవరు". ఈ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుండి అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అడవి శేష్ నటించిన క్షణం, గూఢాచారి చిత్రాలు ఇండస్టీలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాయో తెలిసిందే. ఆ సినిమాల ద్వారా అడవి శేష్ రచనకి మంచి పేరొచ్చింది. థ్రిల్లర్ జానర్ ని బాగా హ్యాండిల్ చేసే శేష్ ఈ సారి కూడా ఆ జానర్ లోనే మనల్ని పలకరించారు.


ఆగస్టు 15 న రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అడవి శేష్ ఖాతాలో ఇది మరో మంచి విజయం. అసలు తెలుగులో అవకాశాలే లేని రెజీనాకి ఈ చిత్ర విజయం మంచి ఊరట. పాత్ర పరంగా చూస్తే ఈ సినిమాలో రెజీనానే మెయిన్ లీడ్. ఆమె ఈ సినిమాలో కనబరిచిన నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయి.


అయితే ఈ సినిమాని చూసిన టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.“చిత్రంలోని ప్రతి సన్నివేశం నేను ఎంజాయ్ చేశాను. ఊహించని మలుపులతో మతి చెదిరింది. దర్శకుడు వెంకట్ రాంజీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని చక్కగా తీశారు, అడివి శేషు, రెజీనా, అద్భుతంగా నటించారు. నిర్మాత పివిపి కి ,అలాగే మొత్తం చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.


అంత పెద్ద సీనియర్ దర్శకుడు మెచ్చుకున్నాడంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వసూళ్ళ పరంగానూ దూసుకుపోతుంది. అంతేకాదు సినిమా టాక్ వల్ల మరికొన్ని థియేటర్లు కూడా పెంచారట. పివిపి సినిమా బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మించిన ఈ మూవీకి వెంకట్ రాంజీ దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: