మూడు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజు రోజుకు కొత్త కొత్త టాస్కులతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. పునర్నవి బ్రేక్ ఫాస్ట్ రాహుల్ కు తినిపించటంతో వితిక నీకు సిగ్గు లేదా? ఇలా తినిపించేది చూస్తే రేపు నిన్ను ఎవరు పెళ్ళి చేసుకుంటారు అని రాహుల్ ను అడుగుతుంది. రాహుల్ నిజమే కదా అని తన చేతితో తనే తింటాడు. ఆ తరువాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో శివజ్యోతి క్విజ్ మాస్టర్ గా మగ ఇంటి సభ్యులు ఒక గ్రూపు, ఆడ ఇంటి సభ్యులు మరో గ్రూపుగా ఏర్పడి క్విజ్ లో పాల్గొంటారు. 
 
మగ ఇంటి సభ్యులు క్విజ్ లో విన్ అవుతారు. విన్ అయిన ఇంటి సభ్యులతో పాటు క్విజ్ మాస్టర్ కు ఆపీ పిజ్ లభిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యులందరూ రాఖీ పండుగ జరుపుకుంటారు. మొదట హిమజ వరుణ్ సందేశ్ కు రాఖీ కడుతుంది. పునర్నవి కూడా వరుణ్ సందేశ్ కు రాఖీ కడుతుంది. రాహుల్ కు తప్ప ప్రతి ఒక్కరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అని పునర్నవి చెబుతుంది. నా తమ్ముడి స్థానాన్ని వేరే ఎవరితో రిప్లేస్ చేయలేను అని శ్రీముఖి చెప్పి తమ్ముడు పంపిన రాఖీని శ్రీముఖి బాబా మాస్టర్ చేత తన చేతికి కట్టించుకుంటుంది. 
 
అషు రెడ్డి మహేశ్ విట్టాకు రాఖీ కట్టగా, శివ జ్యోతి బాబా మాస్టర్ కు రాఖీ కడుతుంది. అలీ బిగ్ బాస్ హౌస్ లో శివ జ్యోతిని తన చెల్లిగా భావిస్తున్నానని చెబుతాడు. అలీ ఇద్దరు చెల్లెళ్ళు వారి రాఖీలతో పాటు శివ జ్యోతితో రాఖీ కట్టించుకోవడానికి ఒక రాఖీ, మరియు అలీ శివ జ్యోతికి బహుమతిగా ఇవ్వటానికి కమ్మలు పంపుతారు. అలీకి శివజ్యోతి రాఖీ కట్టగా అలీ శివజ్యోతికి కమ్మలు బహుమతిగా ఇస్తాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: