ఈ మాట జబర్ధస్త్ షో మొదలైనప్పటి నుంచి వింటూనే ఉన్నాం అని అనుకోవొచ్చు.  ఎందుకంటే నటి రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా మారారు.  వైసీపీ నుంచి ఆమె నగరి ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన తర్వాత బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయాయి.  అయితే ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆమె మూడు నెలల పాటు జబర్ధస్త్ లో కనిపించలేదు.  అంతే కాదు ఆమెతో పాటు మెగా బ్రదర్ నాగ బాబు కూడా ఎన్నికల ప్రచారంలో తిరిగారు. అయితే ఆయన ఓటమి పాలు అయ్యారు.   

రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే కొంత కాలంగా  జబర్ధస్త్ షో కి రోజా గుడ్ బాయ్ చెప్పబోతుందని తెగ వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో ఇటీవల మీనా, సంఘవి ఎంట్రీ ఇచ్చారు.  మరీ వీరిద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో లేదా కొత్త వారే వస్తారో చూడాలి.  అయితే  జబర్ధస్త్ షో రోజా వెళ్లిపోతుందని ఇప్పటి వరకు ఎన్నో సార్లు వార్తలు వచ్చినా..తిరిగి తిరిగి ఆమె ఆ సీట్లో కనిపిస్తుంది. దాంతో ఇవన్నీ రూమర్లే అంటున్నారు. కానీ అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీనితో రోజా తిరిగి జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.  జబర్దస్త్ షోలో జడ్జీలుగా రోజా, నాగబాబు జోడి బాగా పాపులర్ అయ్యారు.

వీరిద్దరూ తప్ప మరొకరు ఆ షోలో ఇమడలేని పరిస్థితి. త్వరలో జరగబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో జడ్జిగా రోజా కనిపించడం లేదు. ఆమె స్థానంలోకి శేఖర్ మాస్టర్ వచ్చారు. నాగబాబు కొనసాగుతున్నారు. దాంతో ఈసారి రోజా శాశ్వతంగా వెళ్లిపోనున్నారా అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. జాకు రెండవసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయట.దీనితో రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసినట్లే అనే ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: