బిగ్ బాస్ లో ఉన్న పదమూడు మంది కంటెస్టెంట్స్ లో ఒక ఇద్దరి వ్యవహారం మీద విమర్శలు వచ్చినప్పటికీ, వారి వల్ల హౌస్ ఆసక్తికరంగా మారిందనేది టాక్.  వారే రాహుల్, పునర్నవి. బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి వీరిద్దరు చాలా స్నేహంగా ఉంటున్నారు. అయితే రాను రాను అది స్నేహాన్ని మించిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే హౌస్ లో వారి ప్రవర్తన కూడా అలాగే ఉంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడా వీరురువి మధ్య సంబంధం గురించి డైరెక్టుగానే మాట్లాడుతున్నారు.


నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇది మరొక్కసారి బయటపడింది. రాఖీ విషయంలో పునర్నవి చేసిన పని వల్ల ఇది మరింత బలపడింది. రాఖీ కట్టడానికి వరుణ్ ని చూపించినపుడు అతని పక్కనే ఉన్న రాహుల్ తననేమో అనుకుని కొంత కంగారు పడ్డాడు. దీంతో హౌస్ మేట్స్ అతన్ని ఆట పట్టించారు. పునర్నవి రాహుల్ కి రాఖీ కట్టనని చెప్పింది. దీంతో రాహుల్ కొంత శాంతించాడు. అయితే వీరిద్దరి వ్యవహార శైలి పర్మినెంట్ కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఎందుకంటే గత సీజన్లని గమనిస్తే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ వ్యవహారం నడిపిన కంటెస్టెంట్స్ మిగతా వారికంటే ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యారు. హిందీ, తమిళ బిగ్ బాస్ సీజన్లలో కూడా ఇదే జరిగింది. ప్రేక్షకులకి ఇటువంటి విషయాల్లో ఉన్న ఆసక్తి కారణంగా ఇంటి నుండి అంత తొందరగా ఎలిమినేట్ అవ్వరు. ప్రేక్షకులను ఇలా లాక్ చేసేందుకే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని, హౌ నుండి బయటకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం ఉండదని ఇదంతా కేవలం గేమ్ కోసమేనని సోషల్ మీడియలో వార్తలు వస్తున్నాయి.


ఇదంతా నిజమే అయితే ఆల్రెడీ నామినేషన్ లో ఉన్న రాహుల్ ఈ వారం సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. రానున్న ఎపిసోడ్లలో వీరిద్దరి మధ్య ఏం జరగనుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: