టావుడ్ లో డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత తనవితీరా ఎంజాయ్ చేస్తున్నారు.  టెంపర్ సినిమా తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. దాంతో రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’తెరకెక్కించాడు.. ఈ సినిమాలో కసి, ఆవేదన అన్నీ కనిపించాయి..రామ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ మొత్తానికి సూపర్ హిట్ అందుకుంది.  దాంతో పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.  అంతే కాదు ఆయనతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.  ఈ నేపథ్యంలో  తన ప్రొడక్షన్ పార్టనర్ ఛార్మితో కలిసి ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.


విజయ్ దేవరకొండ హీరోగా పూరి తన బ్యానర్ పై సినిమా తీయబోతున్నాడు. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయ్ దేవరకొండ కోసమే అనుకున్నారట..కానీ ఆ పాత్రకు మరింత ఎనర్జీ అవసరమనీ..యాక్షన్ సీక్వెన్సీలు ఎక్కువగా ఉంటాయని రామ్ ని సెలెక్ట్ చేసుకున్నారట.  ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి ఛార్మీ దిగినట్లు సమాచారం. జాన్వీతో చర్చలు జరిపిన తర్వాత ఒకవేళ అమ్మడు ఓకే అంటే ప్రాసెస్ షురూ చేస్తారట. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు.

ఇటీవల ఓ టీవీ షోలో జాన్వీ టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని అతడితో కలిసి నటించాలనుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరి, విజయ్ దేవరకొండ కాంబో అంటే అభిమానులు భారీగానే అంచనాలు వేసుకుంటున్నారు. ఇక అతిలోక సుందరి కూతురు తెలుగు లోకి ఎంట్రీ అంటే..అందులోనూ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో అంటే ఇంకేముందీ సూపర్ హిట్ అంటున్నారు.  మరి తన తల్లి మాదిరి తెలుగులో కూడా జాన్వీ సత్తా చాతుతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బయోపిక్ అలానే 'తక్త్' అనే మూవీలొ నటిస్తోంది!



మరింత సమాచారం తెలుసుకోండి: