గత సంవత్సరం బాలీవుడ్  లో వచ్చిన సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. సాధారణంగా ప్రస్తుతం రీమేక్ చిత్రాలు సౌత్ నుండే బాలీవుడ్ లో ఎక్కువగా అవుతున్నాయి. కానీ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ సాధించిన "అంధాధున్" సినిమాని తమిళంలో రీమేక్ చేయనున్నారట. అంధాధున్ సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది. విమర్శకుల నుండి ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది.


ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించిన ఈ చిత్రం టబు, ఆయుష్మాన్ మధ్య ఆసక్తికరంగా సాగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో ఏకంగా మూడు విభాగాలలో అవార్డులు పొందడం జరిగింది. ౨౦౪౮ కి గాను చూడవలసిన చిత్రాలలో "అంధాధున్" మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఆయుష్మాన్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుపొందారు.


 సీనియర్ నటుడు నిర్మాత త్యాగరాజన్ ఈ మూవీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని సీనియర్ హీరో జీన్స్ ఫేమ్ ప్రశాంత్ హీరోగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అంధాదున్ చిత్రంలో హీరో పియానో ప్లేయర్ గా కనిపిస్తారు.హీరో ప్రశాంత్ కి కూడా ఆ కళలో మంచి పట్టు ఉండటంలో ఈ మూవీకి ఆయనే మంచి ఛాయిస్ అని అనుకుంటున్నారు. అనుకున్న విధంగా జరిగితే కొద్దిరోజులలో ఈ మూవీ సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు. మరి హిందీలో లానే తమిళంలో కూడా ఈ సినిమా మ్యాజిక్ ని క్రియేట్ ని చేయబోతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: