వరుసగా హిట్లు కొడుతూ స్టార్ హీరోలకు సవాలు విసురుతున్నాడు యంగ్ హీరో అడివి శేష్. క్షణం హిట్ కావడం తో థ్రిల్లర్ సినిమాల మీద ఆసక్తి పెంచుకున్న శేష్ ఈసినిమా తరువాత అదే జోనర్ లో గూఢచారి సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరోసారి ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్తో వచ్చి మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఎవరు ఓవర్సీస్ లో దూసుకుపోతుంది.వెంకట్ రాంజీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక ఎవరు జోరు కొనసాగిస్తుంటే రణరంగం మాత్రం యూఎస్ఏ లో చేతులెత్తేస్తుంది. ప్లాప్ టాక్ తో ఈ చిత్రం రెండు రోజుల్లో అక్కడ కేవలం $28,467 గ్రాస్ వసూళ్లను రాబట్టి డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరో కాగా సుధీర్ వర్మ దర్శకుడు. అయితే మొదటి రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సత్తాచాటింది కానీ సినిమా టాక్ బాలేకపోవడంతో రెండు రోజు మాత్రం ఓ మోస్తారు కలెక్షన్స్ ను రాబట్టుకుంది. కాగా గత ఏడాది పడి పడి లేచె మనసు తో ప్రేక్షకులముందుకు వచ్చి దెబ్బ తిన్న శర్వానంద్ మరో సారి అలాంటి పరాభవాన్నే చవిచూశాడు. నటుడిగా శర్వా ట్యాలెంట్ ఏంటో మనకు తెలిసిందే. కానీ కథల ఎంపిక విషయంలో తడబడుతూ ఇలాంటి ఫలితాలను చవిస్తున్నాడు. అతనికి తగ్గ కథ దొరికితే మళ్ళీ ఫామ్ లోకి రావడం శర్వా కు పెద్ద కష్టమేమి కాదు.