మరో రెండు వారాల్లో విడుదల కాబోతుంది ప్రభాస్ నటించిన సాహో సినిమా. సాహో ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రభాస్. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్ ను సాహో సినిమా విశేషాలు మాత్రమే కాక నటి అనుష్క గురించి కూడా ప్రశ్నలు అడుగుతోంది బాలీవుడ్ మీడియా. ప్రభాస్ అనుష్క నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. ఈ నాలుగు సినిమాల్లో మిర్చి, బాహుబలి, బాహుబలి2 సినిమాలు హిట్టయ్యాయి. 
 
బాలీవుడ్ మీడియా ప్రభాస్ ను అనుష్కతో మీరు డేటింగ్ లో ఉన్నారట కదా? త్వరలో మీరు అనుష్కను పెళ్ళి చేసుకోబోతున్నారట కదా? మీరిద్దరూ కలిసి లాస్ ఏంజిల్స్ లో ఖరీదైన ఇల్లు కొన్నారట కదా? అని మీడియా ప్రశ్నించటంతో ప్రభాస్ ఇప్పటికే ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు. అనుష్క కేవలం స్నేహితురాలు మాత్రమేనని అనుష్కను కలిసి రెండు సంవత్సరాలు అయిందని ప్రభాస్ చెప్పాడు. 
 
మీడియాలో ఇలాంటి వార్తలు వస్తూ ఉండటంతో అనుష్క  సినిమా గురించి వార్తలు అడగకుండా మధ్యలో నన్నెందుకు లాగుతున్నారని  బాధ పడుతుందని సమాచారం. సాహో గురించి ఇంటర్వ్యూలలో తన ప్రస్తావన ఎందుకని అడుగుతోంది అనుష్క. మేమిద్దరూ పెళ్ళి చేసుకోవటం లేదని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చాం కదా అని అనుష్క ఫైర్ అవుతున్నట్లు సమాచారం. అనుష్క తన చిన్నప్పటి స్నేహితుడితో ప్రేమలో ఉందని 2020 సంవత్సరంలో అతడిని పెళ్ళి చేసుకోబోతుందని సమాచారం. 
 
ప్రస్తుతం అనుష్క నిశబ్దం అనే సినిమాలో నటిస్తోంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. మాధవన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. భాగమతి సినిమా తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన అనుష్క నిశబ్దం సినిమాలో నటిస్తోంది. షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 




మరింత సమాచారం తెలుసుకోండి: