ఇన్నాళ్లు పట్టించుకోలేదు.. ఇక ఉరుకొనేదిలేదు.. అంటూ నిత్యామీనన్ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఆ బ్యూటీకి ఎందుకు అంత కోపం వచ్చిందంటే.. నెటిజన్లు ఈమెపై చేసిన కామెంట్లు కారణమట. వివరాల్లోకి వెళితే.. పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా హిందీలో కూడా కాలుపెట్టింది. మిషన్ మంగళ్ చిత్రంలో ఓ పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా విడుదలై మంచి టాక్ తో దూసుకుకుపోతుంది.  


ఈ మధ్య కాలంలో కేరళలో వరదలు ముంచేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ వరదలకు అతలాకుతలం అయిన భాదితులకు సాయం చేయడానికి చాలా మంది స్టార్స్ ముందుకొస్తున్నారు. రీసెంటుగా తమిళ స్టార్ సూర్య కూడా తన వంతు సాయంగా ప్రటించారు. ఎక్కడో ఉన్న అయన ఇచ్చి అందరు ఇవ్వడానికి ముందుకు రావాలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 


వివరాల్లోకి వెళితే.. కేరళ కుట్టి అయిన ఆమె తన తాజా ఫోటో షూట్  సోషల్ మీడియాలో చేసింది. కొంచం కూడా మానవత్వం లేదు అంటూ కామెంట్లు చేశారు. దానికి స్పందించిన ఈ కుట్టి ఘాటుగా జావాబిచ్చింది. నేను ఏంచేయలేదని ఎవరు చెప్పారు? ఇంకోసారి నన్ను ఏదైనా అంటే ఊరుకొని ప్రసక్తి లేదు? అంటూ మండిపడింది.


ప్రస్తుతం ఈమె తమిళ లెజెండరీ పర్సన్ జయలలిత గారి బయోపిక్ లో నటించబోతుంది. ఈ సినిమాలో పూర్తిగా ఐరన్ లేడీ జయలలితగా మారి నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇకపోతే బాలీవుడ్ మొదటి చిత్రం మిషన్ మంగళ్ ఈమెకు ఎంత గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి. ఇటీవల ఆమె పర్సనాలిటీపై కొంత మంది కామెంట్ చేస్తే వారికి సరైన సమాధానం చెబుతూ సోషల్ మీడియాలో హంగామా చేసింది.  మొత్తానికి ఈ మళియాళ కుట్టి తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతుందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: