తెలుగు లో ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రష్మిక మందన కన్నడంలో కిర్రాక్ పార్టీతో హిరోయిన్ గా నటించింది. నాగశౌర్యతో ‘ఛలో’సినిమాలో నటించిన రష్మికకు వెంటనే విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.   ఈ సినిమాలో విజయ్ దేవరకొండ-రష్మీక కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఔట్ అయ్యింది.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో డీయర్ కామ్రేడ్ మూవీ కూడా వచ్చింది. 

వరుసగా విజయాలు సాధిస్తున్న రష్మిక మందన్నా వరుస ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. తెలుగులో మహేష్ తో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ తో 'భీష్మ' సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. తమిళంలో కార్తీ హీరోగా మరో సినిమాలో నటిస్తుంది. రష్మిక ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.  తన ఇష్టా ఇష్టాలు..సంతోషాలు ట్విట్టర్, ఇన్స్ స్ట్రా గామ్ లో షేర్ చేస్తుంది.  తాజాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది.

తెలుగులో మహేష్ తో 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ తో 'భీష్మ' సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇప్పటి వరకు రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు. తాజాగా చిత్రీకరణ పాల్గొన్న రష్మిక 'సుల్తాన్' షూటింగ్ లో నాల్గవ రోజు అంటూ టైటిల్ చెప్పేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తనకు తెలియకుండానే టైటిల్ రివీల్ చేసేసింది. అంతే ఈ మూవీ టైటిల్ తెలిసిపోయిందోచ్ అంటున్నారు ఫ్యాన్స్. టైటిల్ విన్న కార్తి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రష్మిక స్టేటస్ షేర్ చేస్తుండడంతో విషయం యూనిట్ కి తెలిసిపోయింది. చిత్రయూనిట్ కి రష్మిక షాక్ ఇవ్వడం పై సీరియస్ అయినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: