ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అ! సినిమాకు వచ్చిన గుర్తింపు అందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ కు పురస్కారం దక్కడం తోపాటు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, మేకప్ విభాగాలలో కూడా అ! అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రెండో సినిమా కల్కి ఆశించిన విజయం సాధించనప్పటికి టెక్నికల్ గా మాత్రం గొప్ప ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మూడో సినిమాగా ప్రశాంత్ వర్మ అ! సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్టు లేటెస్ట్ న్యూస్.

అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టుగా సీక్వెల్ లో ఐదారు కథలు ఉండవట. కేవలం ఒక కథతోనే స్క్రీన్ ప్లే సాగుతుందని కాకపోతే ఇంతవరకు ఎవరూ చేయని ప్రయోగాన్ని చేస్తూ చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్టు ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మరోసారి కాజల్ అగర్వాల్ కోసం ట్రై చేస్తున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.  మొత్తానికి మళ్ళీ కృష్ణవంశీ లాంటి మరో క్రియోటివ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి రావడం ఒకరకంగా చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఎందుకంటే అందరు సినిమాలు తీస్తారు. కానీ క్రియోటివ్ కాన్సెప్ట్ తో తీసే దర్శకులు చాలా అరుదు. 

అ!లో కాజలే కాబట్టి ఇందులో కూడా తనే ఉండాలని కోరుకుంటున్నాడట. ఇక మరో ముఖ్యమైన పాత్రకు విజయ్ సేతుపతి కోసం ట్రయ్  చేస్తున్నట్టు తెలిపాడు. నిజానికి అతను తమిళ్ కాకుండా ఇతర బాషా దర్శకులకు దొరకడం ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. సైరాలో ఓబయ్యగా కీలకమైన పాత్ర చేసిన విజయ్ సేతుపతి ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ ఉప్పెన లో నటిస్తున్నాడని సమాచారం. అయినప్పటికి ప్రశాంత్ వర్మకు విజయ్ సేతుపతి దొరకడం పెద్ద ఛాలెంజేనని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అంతేకాదు కాజల్ కథ మెచ్చుకుంది కానీ ఇంకా సైన్ చేయలేదట. ఇవన్నీ ఓ కొలిక్కి వస్తే అ!ను మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చూడొచ్చని చాలా మంది ఆసక్తిగా చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: