డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో జన గణ మణ అనే టైటిల్ తో ఓసినిమా చేద్దాం అనుకున్నాడు. కానీ మహేష్, పూరీకి ఆఛాన్స్ ఇవ్వలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ పక్కకు పెట్టేశాడు. అయితే ఇటీవల కన్నడ స్టార్ హీరో యష్ ను కలిసి ఇదే కథను వినిపించాడట పూరీ. అయితే యష్ ఏం చెప్పాడో తెలియదు. కాగా పూరీ తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా ను ప్రకటించి షాక్ ఇచ్చాడు. అయితే విజయ్ తో తీసే సినిమా ఇదేనని వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజమెంతో తెలియాల్సివుంది.
ఇక పూరి తన డ్రీం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి నానా తంటాలు పడుతుంటే కోలీవుడ్ లో మాత్రం జన గణ మణ స్టార్ట్ కానుంది. అయితే పూరీ జగన్నాధ్ సినిమాకు, ఈసినిమా కు ఎలాంటి సంబందంలేదు కానీ టైటిల్ మాత్రం ఒకటే. జయం రవి హీరోగా నటించనున్న ఈసినిమాకు ఆహ్మద్ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈచిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇక జయం రవి నటించిన తాజా చిత్రం కోమలి ఈగురువారం విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రశాంత్ రంగరాజన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాతో జయం రవి వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ఇంతకుముందు ఆయన నటించిన టిక్ టిక్ టిక్ , అడంగ మారు కూడా సూపర్ హిట్ అయ్యాయి.