తెలుగు మూవీ హీరోయిన్ గా రాణించాలని ఇందాస్త్రీలోకి వచ్చిన శ్రీరెడ్డి తన కలలను నెరవేర్చుకోలేక పోయినా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కోచ్ విషయాలను వెల్లడిచేయడమే కాకుండా ఆ విషయమై ఆమె చాల పెద్ద పోరాటమే చేసింది. ఈ పోరాటంలో ఆమె అనేకమంది హీరోలతో పాటు అనేకమంది టాప్ హీరోయిన్స్ ను కూడ టార్గెట్ చేసింది. 

ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటున్నా సోషల్ మీడియాలో తరుచూ సందడి చేస్తూ అనేకమంది పై ఘాటైన సెటైర్లు వేయడం కొనసాగిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఈమె లేటెస్ట్ గా షేర్ చేసిన రెండు ఫోటోలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈమె షేర్ చేసిన ఒక ఫోటోలో ఒక వ్యక్తి కాలు పై తన కాలు పెట్టి అణగదొక్కుతు కనిపిస్తే మరొక ఫోటోలో ఆమె కాలుకు ఆ వ్యక్తి పూలతో పాద పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. 

దీనితో శ్రీరెడ్డి తన కాలుతో అణగదొక్కుతున్న వ్యక్తి ఎవరూ అంటూ ఆసక్తి పెరిగి పోయి కొంతమంది సోషల్ మీడియాలో ఆమెను ప్రశ్నించడమే కాకుండా కొంతమంది నెటిజన్లు ఆమెను ఉద్దేసించి ఆ అమాయక వ్యక్తి శ్రీరెడ్డి ప్రేమికుడా అంటూ ప్రశ్నలు వేసారు. దానికి సమాధానంగా శ్రీరెడ్డి ఆ వ్యక్తి తన స్నేహితుడు అంటూ సమాధానం ఇచ్చింది. 

ఇప్పుడు ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో శ్రీరెడ్డిని శక్తిస్వరూపిణిగా పోలుస్తూ కొందరు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఆ అమాయక వ్యక్తిని అంతగా హింసించడం ఎందుకు అంటూ జోక్ చేస్తున్నారు. ఏమైనా మరొకసారి శ్రీరెడ్ది చేసే పని మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆమె షేర్ చేసిన ఫోటోలు శ్రీరెడ్ది అభిమానుల మధ్య వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: