బాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన హీరోయిన్ శిల్పా శెట్టి.  బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ  మూవీస్ లో కూడా నటించింది.  తెలుగు లో విక్టరీ వెంకటేష్ నటించిన సాహస వీరుడు-సాగర కన్య సినిమా, తర్వాత బాలకృష్ణతో భలేవాడివి బాసూ సినిమాలో నటించింది.  ప్రభుదేవ నటించిన రోమియో సినిమాలో శిల్పాశెట్టి ఆడి మురిపించింది. ఎక్కువగా బాలీవుడ్  మూవీస్ లోనే నటించిన శిల్పాశెట్టి మంచి యోగా టీచర్.  ఈమె యోగా సీడీలకు ఇప్పటికీ ఎంతో పాపులార్టీ ఉంది. 

యోగా డే రోజు సంథింగ్ స్పెషల్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంది శిల్పాశెట్టి.  అప్పుడప్పుడు యూత్ లో యోగాపై పూర్తి అవగాహన కోసం ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంది.  తాజాగా  బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి పది కోట్ల రూపాయల యాడ్‌ను ఏమాత్రం ఆలోచించకుండా వద్దనేసింది. తాను నమ్మని దాని గురించి తాను ప్రచారం చేయలేనని తేల్చిచెప్పింది. ఓ స్లిమ్మింగ్ పిల్. ఆ పిల్ వేసుకుంటే నాజూగ్గా, సన్నజాజి తీగలా అయిపోతారని చెప్పడమే ఆ ప్రకటన ఉద్దేశం.  కానీ శిల్పాశెట్టి మాత్రం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి..అలాంపుడు అటోమెటిగ్గా ఎవరైనా సన్నగా నాజూగ్గా ఉంటారని ఆమె ఉద్దేశం. నిమిషం కూడా నిడివి ఉండని ఆ యాడ్‌లో నటిస్తే ఎంచక్కా పది కోట్లు వస్తాయని తెలిసినా శిల్ప నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

ఆ ప్రకటన చేయడం తన వల్ల కాదని, మరొకరిని చూసుకోవాలని తేల్చిచెప్పింది. తాను నమ్మని వాటిని ఇతరులతో కొనిపించలేనని శిల్ప పేర్కొంది. స్లిమ్మింగ్ పిల్స్ వాడటం వల్ల తక్షణమే స్లిమ్ గా అవడం...అని యాడ్ లో ఆకర్షించే విధంగా చేయడం వల్ల తెలిసి జనాలను మోసం చేసినట్లే అవుతుందని ఆమె అభిప్రాయ పడిందట. మీ అనునిత్య, ఆహార హక్కుకు కట్టుబడి ఉండటం గర్వకారణమనే భావాన్ని ఏదీ అధిగమించలేదు’’ అని శిల్ప పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: