తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 నాలుగో వారం సందడి మొదలైంది. అక్కినేని నాగార్జున నిన్న వచ్చి మంచి ఎంట్రట్రైన్ చేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 27 రోజులు అవుతున్న సందర్భంలో ఇంట్లో వారి ముసుగు తీయాలని ఓ మాస్క్ తో ఇంటి సభ్యులకు దర్శమిచ్చారు నాగ్. ఆ మాస్క్ ఎందుకు పెట్టానంటే ఇక నుంచి మీ ఇంటి సభ్యులు ముఖం పై ఉన్న మాస్క్ తీసేయాలని అందరూ రియాల్టీకి రావాలని తమలోని సహజత్వాన్ని బయట పెట్టాలని కోరారు. దానికి ఇంటి సభ్యులు ఒప్పుకోవడం మాస్క్ తీశారు. ఇక తర్వాత ఒక్కొక్కరి గురించి ఓ లుక్ వేశారు.
ఈ సందర్భంగా బాబా భాస్కర్, మహేష్ ల మద్య కొన్ని ఆసక్తికర సంభాషన చూపించారు. ఇక ఫేస్కి నల్లటి క్రీమ్ పూసుకుని నవ్వించారు. ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. దీనికి మహేశ్ నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అంటూ సమాధానమిచ్చాడు. నేను చదివింది ఎనిమిదే.. నువ్ ఏం చదివావ్ అని బాబా భాస్కర్ అడగగా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేశ్.
అంత చదువు చదివినోడివి నిన్న బిగ్ బాస్ అడిగిన జీకె ప్రశ్నకు సమాధాన ఇవ్వలేదు అంటూ తిట్టాడు. ఆ తర్వాత సోఫాలో రాహూల్, పునర్నవి ముద్దు ముద్దు మాటల, తర్వాత రాహుల్ మనం ఇలా పడుకుంటే బయట చూసేవారు ఏమనుకుంటారు..ట్రోల్ చేస్తారు అనగానే అలిగిన పునర్నవి పక్క సోఫాలో పడుకుంది. అదే సమయానికి వితిక వచ్చి పునర్నవిని ఎత్తుకొని కింద పడేసింది.
ఆ తర్వాత కిచెన్ లో పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో.. మధ్యలో వరుణ్ కల్పించుకొని వితికాకు సర్ధి చెప్పారు. తర్వాత నాగార్జున ఒక్కొక్కరికీ అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు. అలాగే నామినేషన్ లోకి వెళ్లివారిలో ఏడుగురు ఉండగా.. వారిలో శివజ్యోతి, వరుణ్ లు సేవ్ అయినట్లు తెలిపారు.