టాలీవుడ్ లో యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.  అయితే ఎంత సూపర్ హిరో అయినా హిట్స్, ఫ్లాప్స్ కామన్. ఈ విషయం విజయ్ దేవరకొండకు నోటా, డీయర్ కామ్రెడ్ తో తెలిసి వచ్చింది.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా బాక్సాఫీస్ షేక్ చేస్తే ఆ రెండు సినిమాలు మాత్రం దారుణమైన ఫలితాలు ఇచ్చాయి.  ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు.  ఈ మద్య విజయ్, రష్మికల మద్య కెమిస్ట్రీ గురించి బయట రక రకాలుగా టాక్ నడుస్తుంది. 

ఈ నేపథ్యంలో రష్మికకు అలాంటివి ఏవీ లేవని రూమర్స్ కామన్ అని కొట్టి పడేసింది.  దీనిపై విజయ్ దేవరకొండ కూడా అలాంటి రూమర్స్ పై విజయ్ దేవరకొండ కూడా కొట్టి పడేశారు. డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఊహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాలుగు భాషల్లో తన సినిమాను రిలీజ్ చేసిన విజయ్ ఒక్క భాషలో కూడా సక్సెస్ కాలేకపోయాడు. 

ఈ మూవీపై వస్తున్న నెగిటీవ్ కామెంట్స్ పై స్పందించిన ఆయన తెలుగు సినిమాలో ఇలాంటి నెగిటివీటి ఉండడం చాలా బాధగా ఉందని అయితే వీటిని తాను అంతగా పట్టించుకోనని ఎవరి ఇష్టం వాళ్ళది అని కూల్ గా కౌంటర్ ఇచ్చాడు.ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో విజయ్ రైటర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఓ మూవీలో నటించబోతున్నారని..ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వి హీరోయిన్ గా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది.  ఇందుకోసం నటి, నిర్మాత ఛార్మీ రంగంలోకి దిగినట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ఛార్మి ఆ విషయాన్నీ అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: