తల అజిత్ ఈ ఏడాది రెండో సారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ ఏడాది ప్రారంభంలో విశ్వాసం తో ప్రేక్షకులముందుకు వచ్చిన అజిత్... ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఈసినిమా తరువాత అజిత్ నటించిన తాజా చిత్రం 'నెర్కొండ పరవాయ్. ' ఇటీవల విడుదలైన ఈచిత్రం సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద సత్తా చాటుతుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఆలా అజిత్ ఈ ఏడాది రెండో సినిమాల తో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.
అయితే 'నెర్కొండ పరవాయ్ కి జయం రవి, 'కోమలి' నుండి తీవ్ర పోటీ ఎదురవుతుంది. ఈ గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది దాంతో రెండో వారంలో అజిత్ సినిమా స్లో అయిపోయింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ద శ్రీనాథ్ , అభిరామి , ఆండ్రియా కీలక పాత్రల్లో నటించారు. 'ఖాకి' ఫేమ్ వినోత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు.
ఇక అజిత్ ప్రస్తుతం తన 60వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. హెచ్ వినోత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని కూడా బోనీ కపూరే నిర్మించనున్నాడు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కాగా ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ముఖ్య పాత్రలో నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేగాని జరిగితే కోలీవుడ్ లో ఆమె కు ఇదే మొదటి సినిమా అవుతుంది.