విజయ్ దేవరకొండ మాటలలో నడక తీరులో ప్రతి విషయంలోనూ చాల విభిన్నంగా కనిపిస్తూ ఆ విషయాలలో తన యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తూ ఉంటాడు. దీనితో విజయ్ కు అభిమానులతో పాటు శత్రువులు కూడ ఇండస్ట్రీలో పెరిగిపోతున్నారు. 

వరస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ కు ఈ మధ్య పరాజయాలు పలకరించడంతో పాటు ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్యూర్ విజయ్ తీరులో తీసుకువచ్చిన మార్పు స్పష్టంగా ఈ మధ్య జరిగిన ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ లో కనిపించింది. ముఖ్యంగా మైక్ పట్టుకోవడం దగ్గర నుంచి మాట్లాడే విధానం వరకు విజయ్ లో వచ్చిన తేడాలను చూసిన వారు చాలమంది ఆశ్చర్యపోతున్నారు. 

తన మాటలలో ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించకుండా విజయ్ ప్రవర్తించిన తీరును పరిశీలించిన వారు ఇది అంతా ‘డియర్ కామ్రేడ్’ కలగచేసిన జ్ఞానోదయమా అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు సెటైర్లు వేసుకున్నట్లు టాక్. ఇప్పటి వరకు యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న విజయ్ ఇప్పుడు తన తీరును మార్చుకుని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నవిషయం సైమా ఫంక్షన్ లో విజయ్ తీరును పరిశీలించిన వారు విశ్లేషిస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్ అయినా సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో అదేవిధంగా ఈ ఫంక్షన్ జరిగిన ఖతార్ ఎయిర్ పోర్ట్ లో విజయ్ ని చూడటానికి ఎగబడ్డ తెలుగువారిని చూస్తే విజయ్ మ్యానియా ఇంకా బాగా కొనసాగుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. పూరీతో చేయబోతున్న మూవీతో మాస్ ప్రేక్షకులకు విజయ్ కనెక్ట్ అవ్వగలిగితే విజయ్ ఈ ఫ్లాప్ ల భారం నుండి త్వరగానే బయటపడే ఆస్కారం ఉంది. అయితే పూరీ సినిమా అంటేనే లాటరీ కాబట్టి ఆ ఒక్క విషయంలోనే విజయ్ దేవరకొండకు టెన్షన్..  


మరింత సమాచారం తెలుసుకోండి: