రష్మిక మందన 2016లో కిరిక్ పార్టీ  అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమవ్వగా,ఛలో చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజనిపుత్ర,గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది.నాగ శౌర్య తో  కలసినటించిన ఛలో ఆమె తొలితెలుగుచిత్రం అవ్వగా,ఆ తర్వాత విజయ్ దేవరకొండతో గీతగోవిందం,డియర్ కామ్రేడ్,నానితో దేవదాస్ సినిమాల్లో కలిసి నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ కర్ణాటక బ్యూటీ ఆ తర్వాత సౌత్ లో వరుసఅవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళుతుంది..



ప్రస్తుతం ఈమె కార్తీ హీరోగా ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది.ఐతే ఆమె కొంచెం ఎక్సయిట్మెంట్ లో ఆ మూవీకి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటో షేర్ చేయడంతోపాటు ఆ చిత్ర టైటిల్ సుల్తాన్ అని రివీల్ చేయడంతో చిత్ర యూనిట్ కొంచెం షాక్ గురయ్యారని సమాచారం నిజానికి కార్తీ నెక్స్ట్ మూవీ టైటిల్ గా సుల్తాన్ పరిగణలో ఉందన్నవిషయం ఎప్పటినుండో ప్రచారంలోఉంది.ఐతే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.కానీ రష్మిక ఇన్స్టా గ్రామ్ పోస్ట్ వలన టైటిల్ బయటకు రావడంతో చిత్ర యూనిట్ కొంచెం అసహనానికి గురైనట్లు తెలుస్తుంది.



కాగా రష్మిక ప్రస్తుతం బన్నీ,సుకుమార్ మూవీలతో పాటు నితిన్ నటిస్తున్న భీష్మ చిత్రాలతో పాటు,మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు..కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించిన రష్మిక కర్ణాటకలో కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.తర్వాత MS రామయ్య కాలేజ్ఆఫ్ఆర్ట్స్ సైన్స్ నుండి సైకాలజీ,జర్నలిజం మరియు ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014'జాబితాలో చోటు సంపాదించగా,2016లో 24వ స్థానం, 2017లో మొదటి స్థానంలో నిలిచింది.కొసమెరుపేంటంటే 2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించి అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది మరియు క్లీన్ & క్లియమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా చేసి సినిమాల్లోకి వచ్చింది 


మరింత సమాచారం తెలుసుకోండి: