మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజీయస్ మూవీ సైరా.. నరసింహారెడ్డి. దాదాపు రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుని రిలీజ్ కు దగ్గరపడుతోంది. తెలుగు, హిందీతోపాటు దక్షిణాది భాషలన్నింటిలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నాడు నిర్మాత రామ్ చరణ్. ఇందులో భాగంగా తెలుగు టీజర్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఇస్తున్నారు మేకర్స్.

 


ఇప్పుడు మరో ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది. సైరా మళయాళ వెర్షన్ టీజర్ కు సూపర్ స్టార్ మోహన్ లాల్ తన వాయిస్ అందించనున్నారనే వార్త ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. ఈ వార్త నిజమైతే సైరాకు మళయాళంలో మంచి క్రేజ్ రావడం ఖాయం. ఈ విషయంపై ఇప్పటికే మోహన్ లాల్ ను అప్రోచ్ అయ్యాడట చరణ్. మళయాళ సూపర్ స్టార్ కు మెగాస్టార్ కూ మంచి స్నేహం ఉంది. దాంతో ఈ సినిమాకు మళయాళంలో మంచి హైప్ తీసుకొచ్చేందుకు రామ్ చరణ్ ఈ ప్రయత్నం చేస్తున్నాడట. చిరంజీవికి ఇదివరకే మళయాళంలో తగిన గుర్తింపు ఉంది. చిరంజీవి గత సినిమాలు మళయాళ డబ్బింగ్ వెర్షన్ లో విడుదలయ్యేవి.

 


భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడి వీరగాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నిహారిక.. తదితర భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన్ సైరా మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లెవల్స్ ఈ వీడియోలో ప్రస్ఫుటంగా కనిపించాయి. సైరా టీజర్ ఈ నెల 20న వస్తూండగా.. సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: